సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాలీవుడ్లో ఈ పేరు మారుమోగిపోతుంది. కేవలం దర్శకత్వం వహించింది రెండు మూడు సినిమాలే అయినా.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమైన సందీప్ రెడ్డి ఇటీవల రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీ తో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా లెవెల్లో మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసుళను కల్లగొట్టి ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా అదే ఊపుతో దూసుకుపోతుంది.
సినిమాపై పలు ట్రోలింగ్స్ జరిగినప్పటికీ.. సినిమా చూసే ప్రేక్షకుల లిస్ట్ రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ప్రసంసలు అందుకున్న సందీప్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఆయన చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరుకి నేను పెద్ద ఫ్యాన్.. ఒకవేళ అవకాశం వస్తే మెగాస్టార్ తో యాక్షన్ డ్రామా చేయాలని ఉంది అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.
ఇక యానిమల్ సినిమా మహిళలపై ద్వేషం, హింసను ప్రేరేపించేలా ఉందని కొందరు మాట్లాడుతున్నారు. దానిపై మీరు ఏమంటారు అని అంటారు అని ఇంటర్వ్యు వర్ అడగగా మూవీని మూవీ లాగే చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు. సందీప్ రెడ్డి మొత్తానికి చిరంజీవితో ఓ సినిమా చేయాలని ఉంది అని చెప్పడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిరు ఫ్యాన్స్ అంతా ఎలాగైనా సందీప్ తో సినిమా చేసి సక్సెస్ కొడితే బాగుండు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకా సందీప్ రెడ్డి సినిమా అంటే మార్క్ రొమాన్స్, యాక్షన్ కచ్చితంగా ఉంటాయి. ఈ ఏజ్ లో చిరు అలాంటి కంటెంట్లో నటిస్తే సినిమాను ఎవరు చూస్తారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.