సలార్ సెట్స్‌లో ఆ పని చేసిన ప్రభాస్, పృధ్వి రాజ్‌, శృతి హాసన్… వీడియో వైరల్..!

సలార్ మూవీ థియేటర్లలో విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఇక తాజాగా శృతిహాసన్.. సలార్ మూవీ సెట్స్ లో ఇప్పటివరకు ఎవ్వరు చూడనటువంటి ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.

ఇక ఇందులో శృతి హాసన్ క్రికెట్ ఆడుతున్న వీడియో కూడా ఉండడం గమనార్హం. ఈమె షేర్ చేసిన దాంట్లో శృతి హాసన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి క్రికెట్ ఆడుతున్న వీడియోతో పాటు ప్రభాస్, ప్రశాంత్ లతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ ఫొటోస్ కింద క్యాప్షన్ ఇస్తూ..” సలార్ మెమోరీస్.. ఈ అద్భుతమైన వ్యక్తులతో కలిసి పని చేయడానికి నేను బాగా ఎంజాయ్ చేశాను. చాలా సరదాగా గడిపాం. ప్రభాస్ మాకు తినిపించాడు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు.

షాట్స్ మధ్యలో ప్రశాంత్ సార్ మ్యాచులు ఆడుతూ సరదాగా గడిపారు. ఈ సినిమాలో నటించడం చాలా బాగుంది. మంచి వాళ్లకు జీవితంలో మంచే జరగడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఎంతో హార్డ్ వర్క్ తో పాటు ఎన్నో మార్పులు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన ఫిల్మ్ లో నన్ను భాగం చేసినందుకు ప్రశాంత్ సర్ కి, హోంబలే ఫిల్మ్ల్ కి థాంక్యూ ” అంటూ రాసుకు వచ్చింది. ఇక ప్రస్తుతం శృతిహాసన్ షేర్ చేసినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)