ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికీ ప్రేక్షకుల మంచి హైప్ను తెచ్చిపెట్టింది. పుష్ప మూవీ హిట్ తో ఎన్నో అవార్డులను దక్కించుకున్న అల్లు అర్జున్ ఇటీవల బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ లో పుష్పా 2 మూవీ షూటింగ్ జరుగుతుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చాలా రోజుల నుంచి షూట్ చేస్తున్నారు.
ఇప్పటికే గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ తో ఓ సాంగ్ వేయమంది డాన్సర్లను తీసుకొని మరీ షూట్ చేసినట్లు టాక్. ఈ పాటతొ పాటు అక్కడ భారీ యాక్షన్స్ సన్నివేశాలను కూడా షూట్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ స్టార్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో బన్నీకన్ను బాలీవుడ్ పై పడింది. ఇటీవల యానిమల్ మూవీ తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగతో అల్లు అర్జున్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ రూపొందించబోతుంది. ఇక తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ కి సంబంధించిన మరో ప్రముఖ సంస్థ అల్లు అర్జున్తో సినిమాకు చర్చలు జరుపుతుందట. భారీ ప్రాజెక్టుకు ఈ టీం ప్లాన్ చేస్తున్నారట. ప్రొడక్షన్ హౌస్ నుంచి వివరాలు బయటకు రాకపోయినా చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. దీన్నిబట్టి బాలీవుడ్ స్ట్రాంగ్ ఎంట్రీ కి బన్నీ మాస్టర్ స్కెచ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక గతంలో బన్నీ సంజయ్ లీల బన్సాలి కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా బాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా లెవెల్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారని.. ఆ మూవీకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్త ఉందో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.