తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారు అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో.. అల్లు అర్జున్తో కలిసి పరుగు సినిమాలో నటించింది హీరోయిన్ షీలా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.. ఈ సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ముఖ్యంగా అప్పట్లో ఈ సినిమాలోని పాటలు హైలెట్గా నిలిచాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా తండ్రీ కూతుర్ల మధ్య ఉండే ఎమోషన్స్ అన్ని వేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేశాయి.
ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో నటించిన షీలా ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అనే విషయంపై ఆర తీయగా.. ఈమె ఫోటోలు చూసి పలువురు నటిజెన్లు అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నారు.. పరుగు సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన అదుర్స్ రామ్ నటించిన మస్కా వంటి చిత్రాలలో నటించింది.
ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది షిలా. తెలుగులో చివరిసారిగా బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో మాత్రమే నటించింది.
తెలుగులో తమిళంలో మలయాళం లో పలు చిత్రాలలో నటించిన ఈ అమ్మడు సక్సెస్ కాలేకపోవడంతో 2018 తర్వాత షీలా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. 2020లో సంతోష్ రెడ్డిని వివాహం చేసుకొని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తన కుటుంబంతోనే ఎక్కువగా తన సమయాన్ని గడుపుతోంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. షీలా ఫోటోలు చూసిన అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram