ప్రజెంట్ సోషల్ మీడియాలో విగ్నేష్ శివన్-నయనతార పేర్లు ఎలా ట్రెండ్ అవుతున్నాయో ట్రోలింగ్ కి గురవుతున్నాయో మనకు తెలిసిందే. దానికి మెయిన్ రీజన్ పెళ్లి తర్వాత కేవలం నాలుగు నెలలకే వాళ్ళు ఇద్దరు బిడ్డలకు అమ్మానాన్నలు అయ్యారు. ఇది అంత సరోగసి ప్రాసెస్ ద్వారా జరిగింది అనే జనాలు చెప్పుకొస్తున్న.. సరైన ప్రూఫ్ లేదు . మరి కొంతమంది దత్తత తీసుకున్నారు అంటూ మాటలు వినిపిస్తున్నా దీనికి సరైన ప్రూఫ్ లేదు. దీంతో స్టార్ హీరోయిన్ డైరెక్టర్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది . బాధ్యతగల స్టార్ స్టేటస్ పొజిషన్లో ఉన్న మీరు ఇలా చేయడం నేరం అంటూ చివాట్లు పెట్టింది. అంతే కాదు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే కోర్టుకి అందించాలని కోరింది.
కాగా అందుతున్న సమాచారం ప్రకారం నిజంగా విగ్నేష్ శివ నయనతార సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డలని కని ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్లకు ఐదేళ్లు జైలు శిక్ష పడుతుంది అని చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు వాళ్లు తప్పించుకోవడానికి ఆస్కారమే లేదట. అంత స్ట్రిక్ట్ కండిషన్స్ తమిళనాడు గవర్నమెంట్ పెట్టబోతుందట. అయితే ఒకవేళ ఇదే నిజమైతే నయనతార విగ్నేశ్ ఇద్దరు జైల్లో చిప్పకూడు తినాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు .ఈ క్రమంలోనే గతంలో జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
మనకు తెలిసిందే ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి ఏం చెప్పినా జరుగుతుంది అనే నమ్మకం జనాల్లో ఉంది. గతంలో సమంత విషయంలో చెప్పింది చెప్పినట్లే జరిగింది . ఇక తర్వాత ప్రభాస్ విషయంలోనూ అదే జరిగింది. చంద్రబాబు నాయుడు విషయంలోనూ అదే జరిగింది . నయనతార పెళ్లి చేసుకోబోతుంది అని తెలియగానే వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే . నయనతార జీవితంలో పెళ్లి అచ్చిరాదని పెళ్లి అయిన మరోక్షణం నుంచి ఆమె కష్టాల కొలిమిలో చిక్కుకోవచ్చు అని కచ్చితంగా ఆమె వివాహం బంధం నిలుపుకోలేదని డివోర్స్ తీసుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ నిజంగా అదే జరిగితే ఈ చిక్కుల కారణంగా విగ్నేశ్ నయన్ విడిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. అప్పుడు నయన్ జీవితంలో వేణు స్వామి చెప్పినట్లు విడాకులు నిజమవుతాయి ఏమో..?