తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య, సమంత. చాలా రోజులు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించు మరి వివాహం చేసుకున్నారు. వివాహమైన నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్నా వీరీ వివాహ బంధంలో అనుకోని కారణాలు చేత మనస్పర్ధలు రావడంతో విడిపోవడం జరిగింది. ఇక వీరిద్దరూ విడిపోతారు అనే విషయం చెప్పగానే అభిమానుల సైతం ఎందుకు విడిపోతున్నారో అనే విషయంపై చాలా బాధపడ్డారు. సమంత నాగచైతన్య విడిపోయి ఇప్పటికే సంవత్సరం పైన కావస్తోంది.
వీరిద్దరు విడాకులు తీసుకొని ఏడాది కావస్తున్న నేపథ్యంలో వీరి గురించి పలు వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ విడాకుల తర్వాత ఎవరిదారి వారు చూసుకొని సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. సమంత మాత్రం కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ,హాలీవుడ్ వంటి రేంజ్ కి వెళ్ళిపోతోంది. నాగచైతన్య టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. నాగచైతన్య,సమంత విడిపోయారు అనే వార్తలపై పలు రకాలుగా ఊహాగానాలు వినిపించాయి. వీరి గురించి తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సమంత నాగచైతన్య కలిసి తీసిన మొదటి చిత్రం ఏంమాయ చేశావే.
ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ చిత్రంలో కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు పెట్టుకున్న పోస్టర్లని తమ ప్రేమకి గుర్తుగా ఒక ఫ్రేమ్ లో చేయించుకొని ఎప్పటికీ స్వీట్ మెమోరీ లాగా ఉండాలని పెళ్లికి ముందు వీరిద్దరూ చెరో ఒకటి చేయించుకున్నారట. కానీ విడాకులు తీసుకున్నాక సమంత వారి ప్రేమకు గుర్తుగా ఉన్న ఈ ఫోటోను ముక్కలు ముక్కలు చేసినట్లు సమాచారం. నాగచైతన్య మాత్రం ఆ ఫోటోని సమంతకు గుర్తుగా ఉంచుకొని చాలా భద్రంగా ఉంచారట. దీన్ని బట్టి చూస్తే విడాకులు తీసుకోవాలని కోరుకున్నది ఎవరో చెప్పకనే చెప్పవచ్చని తెలుస్తొంది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలి.