అంత బాధలోను ఫ్యాన్స్ కోసం ఆ పని చేసిన ప్రభాస్..కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!!

సీనియర్ హీరో కృష్ణంరాజు మరణాన్ని ఆయన అభిమానులు, తెలుగు ప్రజలు, సినీ తారలు రాజకీయ నాయకులు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నాడు జరిగాయి. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.

Krishnam Raju's last rites performed with state honors, Prabhas,

కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయినా అంత బాధలో ఉన్న ప్రభాస్ తన అభిమానులు గురించి ఆలోచించారట. కృష్ణంరాజు అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చిన అభిమానులందరికీ ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేశాడట. అంత్యక్రియలు ముగించుకుని వెళ్లేటప్పుడు ప్రభాస్ అందరిని భోజనం చేసి వెళ్ళండి అని చెప్పిన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్ పై ప్రశంస‌లు కురిపిస్తున్నారు.

ప్రభాస్ అంతటి దుఃఖంలో కూడా అభిమానుల గురించి ఆలోచించడం అలా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో. ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతూ ఆయన అభినందిస్తున్నారు. రాజు ఎక్కడున్నా రాజు అంటూ ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.