ఎవడ్రా చెప్పింది విజయ్ రెమ్యూనరేషన్ ఇచ్చేసాడని..పూరి కామెంట్స్ వైరల్..!?

“ఏంటి.. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసాడా..? ఎవడ్రా చెప్పింది మీకు..” ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన పాన్ ఇండియా ఫిలిం లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా రికార్డ్ కొల్లగొట్టింది. నిజానికి ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందంటూ కొందరు కామెంట్ చేశారు.

సీన్ కట్ చేస్తే షేక్ కాదు కదా షాక్ కూడా ఇవ్వలేదు అంటు నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. కాగా ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకోనున్న పూరి, చార్మి.. నిలువునా మునిగిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దాదాపు 20 ఏళ్ళు సంపాదించుకున్న డబ్బు అంతా ఛార్మీ ఈ సినిమా పై నే పెట్టి.. కోట్ల నష్టం వచ్చింది అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే చలించిపోయిన విజయ్ దేవరకొండ.. తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచేసాడని న్యూస్ హాట్ టాపిక్ గా మారింది .

సినిమా అనుకోని విధంగా ఫ్లాప్ కావడంతో హర్ట్ అయిన విజయ్ దేవరకొండ తనకు తగ్గ సహాయం చేయాలని చెప్పి సినిమాకి తీసుకున్న ఆరు కోట రెమ్యూనరేషన్ ని మొత్తం వెనక్కి ఇచ్చేసాడట. ఇదే న్యూస్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అయితే ఇదే విషయాన్ని పూరీ దగ్గర ప్రస్తావించిన ఆయన స్నేహితుడికి పూరి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడట. ” ఎవరండీ మీకు చెప్పింది విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచేసాడని ..

ఇప్పటివరకు నాకు విజయ్ దేవరకొండ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ..అసలు సినిమాకి సంబంధించిన ఫెయిల్యూర్ గురించి కూడా మాట్లాడలేదు ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట. దీంతో ఈ విషయం సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి విజయ్ కత్తి, తోఫు, తురుము అనుకున్నా అభిమానులంతా కనీసం పూరి జగన్నాథ్ ఇంత ఇబ్బందుల్లో ఉంటే సగం కూడా ఇవ్వలేకపోయావా అంటూ కామెంట్ చేస్తున్నారు, మరి చూడాలి ఈ ఇబ్బందుల నుండి పూరి ఎలా బయట పడతారో..?