టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన మీడియా సైతం వీరి కాపురంపైనే ఫోకస్ పెట్టేసింది. తమ దాంపత్య జీవితంపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ అటు చైతు గానీ, ఇటు సమంత గానీ నోరు విప్పనే విప్పడం లేదు.
దాంతో అక్కినేని అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. చై-సామ్ విడిపోకూడదంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి విడాకులు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు వీరిద్దరూ విడాకులే తీసుకోవడం లేదట. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో నాగచైతన్య, సమంత ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారట.
ఈ వెబ్ సిరీస్ విడాకుల కథాంశంతో తెరకెక్కబోతోందట. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ పబ్లిసిటీ కోసంమే సామ్-చై విడాకుల మ్యాటర్పై స్పందించడం లేదనే వార్త ఒకటి బయటకు వచ్చి నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో పక్కన పెడితే.. ఈ వార్త విన్న అక్కినేని అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నారట.