టీం ఇండియా ప్లేయర్ శిఖర్ ధావన్ తన భార్య ముఖర్జీతో విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా వీరి సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజాగా ధావన్ భార్య అమేషా ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఆ పోస్టులో విడాకులకు సంబంధించి కొన్ని అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది.దీనిపై శిఖర్ధావన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిశ్చయించుకున్నారు అన్నట్లుగా కనిపిస్తోంది.అయితే ఈ విషయంపై ధావన్ ఇప్పుడు స్పందిస్తాడో వేచిచూడాల్సిందే
శిఖర్ ధావన్, అమేషా ముఖర్జీ.. వీరి వివాహమే దాదాపుగా 9 సంవత్సరాలు కావస్తోంది.వీరిద్దరూ 2012 లో ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించాడు.శిఖర్ ధావన్ కంటే అమే షా 10 సంవత్సరాలు పెద్దది.ధావన్ ఆమెను వివాహం చేసుకునేటప్పుడు కి ఆమెకు ఇద్దరు కుమార్తెలు. అయితే దావన్ అమెజాన్ వివాహం చేసుకునేటప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తాయి.తనకంటే పెద్ద వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వెనక రకరకాలుగా ప్రచారం జరిగింది.
కానీ వీరి వివాహానికి శిఖర్ ధావన్ ఫ్యామిలీ సపోర్ట్ చేసినట్లు అమేషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ గత సంవత్సరం నుంచి వీరిద్దరూ సన్నిహితంగా లేరని ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఉంటుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అనుభవాలను చేసుకున్నట్లు సమాచారం.ఇక తన భర్త ఫోటోలను కూడా అమేషా ఈ మధ్య కాలంలో అన్ని తొలగించినట్లు సమాచారం.ఏది ఏమైనా ఆమేషా రెండవసారి విడాకులు తీసుకుంటోంది.