తెలుగు, తమిళంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు విలన్ అంటే ముంబై నుంచి రప్పించే వారు. కానీ ఈ మధ్య కాలంలో తమిళ నటులనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక విజయ్ సేతుపతి రావడంతో ఒక్కసారిగా విలనిజానికి అసలైన నిర్వచనం తెలియజేశాడు.
ఇక రీసెంట్ గా విజయ్ సేతుపతి, సముద్రఖని కూడా విలనిజంలో భాగం మెప్పిస్తున్నారు. ఇక తమిళంలో కూడా ఈయన మంచి దర్శకుడిగా పేరు పొందాడు. కానీ కొన్ని కారణాల చేత విలన్ గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు సముద్రఖని. ఇక క్రాక్ , అల వైకుంఠపురంలో వంటి సినిమాలలో ఒక మంచి పాత్రను పోషించడంతో ఈయన ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
త్రివిక్రమ్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సముద్రఖని రెండు సినిమాలు చేయడం చేత బాగా పాపులర్ సంపాదించి ,మంచి అవకాశాలను సంపాదించుకుంటున్నాడు. ఇక అంతే కాకుండా ఆర్ ఆర్ ఆర్ మూవీ లో కూడా ఒక కీలకమైన పాత్రను చేస్తున్నట్లు తెలుస్తున్నది. అంతేకాదు గోపీచంద్ మలినేని తాజా చిత్రంలో కూడా ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.
ఇక ఆ తర్వాత డైరెక్టర్ తేజ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు వినిపిస్తున్నది. ఈ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. అందుకు పారితోషికంగా ఆయన దాదాపుగా ఎన్నో కోట్లను అడిగాడని తెలుస్తున్నది. ఇక ఈ సినిమాకి ఇంత అడగడం చేత సురేష్ బాబు బడ్జెట్ ఎక్కువ అవుతుందని అభిప్రాయంతో ఉన్నాడట.ఈ పాత్రను ఆయన చేయడం వల్లనే ఈ సినిమాకు మంచి హైప్ వస్తుందని ఒప్పించడంలో ఉన్నట్లు తేజ తెలుస్తున్నది.