ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉంటే.. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరొకరు హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
బెల్లంకొండ సురేశ్ రెండో తనయుడు గణేశ్ త్వరలోనే ఓ హిందీ రిమేక్తో తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. 2006లో షాహిద్ కపూర్, అమృతారావు జంటగా నటించిన చిత్రం వివాహ్ రీమేక్ హక్కులను దక్కించుకున్నారట బెల్లంకొండ సురేశ్.
ఈ రీమేక్ చిత్రంతోనే గణేశ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట. అయితే ఈ చిత్రంలో గహేశ్కు జోడీగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని ఎంపిక చేశారట. ఇందులో భాగంగానే కృతితో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన కూడా రానుందట.