పుంగనూరు కేసులు..చల్లా-నల్లారిపైనే గురి..వైసీపీకి ప్లస్సేనా?

ఇటీవల చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో తంబళ్ళపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ, టి‌డి‌పి శ్రేణుల మధ్య దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే టి‌డి‌పి శ్రేణులని బాబు రెచ్చగొట్టి..వైసీపీ, పోలీసులపై దాడులు చేయించారని చెప్పి వైసీపీ నేత కేసు పెట్టగా, చంద్రబాబుతో సహ టి‌డి‌పి నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ రెండు చోట్ల ఏం జరిగిందో అక్కడి ప్రజలకు తెలుసు. మొదట తంబళ్ళపల్లెలో బాబు టూర్ ఉంటే..వైసీపీ శ్రేణులు ఎందుకు […]

బాబు-పవన్ ఎటాక్..జగన్‌కు లాభమే.!

ఏపీలో ప్రతిపక్ష నేతలు జోరు పెంచారు. ప్రజల్లో తిరుగుతూ..జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు విరుచుకుపడుతున్నారు. మొదట టి‌డి‌పి చంద్రబాబు..ప్రజల్లో తిరుగుతూ రోడ్ షోలు, సభలు అంటూ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇక బాబు బ్రేక్ ఇవ్వగానే పవన్ వారాహి యాత్ర అని స్టార్ట్ చేశారు. ఆ యాత్రలో జగన్, వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక పవన్ గ్యాప్ తీసుకోగానే బాబు ఎంట్రీ ఇచ్చారు. సాగునీటి […]

టీడీపీలోకి శ్రీదేవి..సీటుపై ఆశలు లేనట్లే.!

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..టీడీపీలో చేరడం ఖాయమైంది. తాజాగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉన్న చంద్రబాబుని కలిశారు. మొన్న ఆ మధ్య వైసీపీ శ్రేణులు తనపై మాటల దాడి చేయడం, తన పార్టీ ఆఫీసులపై దాడి చేసినప్పుడు చంద్రబాబు, లోకేష్ తనకు మద్ధతుగా నిలించారని అందుకే కృతజ్ఞత తెలుపుకోవడానికి బాబుని కలిశానని శ్రీదేవి చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఆలోచించుకున్నానని, ఏపీలో టి‌డి‌పి హవా ఉందని, టి‌డి‌పితోనే న్యాయం జరుగుతుందని, అందుకే యువగళం […]

విశాఖలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ.!

అధికారికంగా టి‌డి‌పి-జనసేన పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనే అంశంపై మాత్రం చర్చ నడిచిపోతుంది. పైగా ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్..త్వరలోనే జనసేన ఏ సీట్లలో పోటీ చేస్తుందో చెబుతామని అన్నారు. అంటే అన్నీ సీట్లలో జనసేన పోటీ చేయడం లేదు. దీని బట్టి చూస్తే టి‌డి‌పితో పొత్తు రెడీ అయినట్లే. అందుకే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో చర్చలు నడుస్తున్నట్లు […]

రాజానగరంలో రాజాతో ఈజీ కాదే.!

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ టి‌డి‌పి అధినేత చంద్రబాబు…రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా తూర్పు గోదావరిలో పర్యటించారు. అక్కడ పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పరిశీలించారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు అనుకున్న విధంగా జనం రాలేదు. ఇక బాబు యథావిధిగా అదే బోరింగ్ స్పీచ్‌లతో సభ ముగించేశారు. కాకపోతే రాజానగరం […]

ఈసారి అయినా.. సొంత జిల్లాలో చక్రం తిప్పుతారా….!?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తెలుగుదేశం పార్టీకి ఎలాగైనా సరే పూర్వ వైభవం తీసుకురావాలనేది మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు ప్లాన్. అందుకోసం దాదాపు రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇవే తన చివరి ఎన్నికలు అని కూడా కర్నూలు జిల్లా పర్యటనలో బాబు ప్రకటించారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ఏడాది ముందే అధికారంలో వస్తే అమలు చేసే పథకాల జాబితాను రాజమండ్రి మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. అలాగే పార్టీ నేతలకు ఇప్పటి […]

పోలవరం రాజకీయం..ఎవరు కరెక్ట్?

ఏపీ జీవనాడి పోలవరం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ మరింత నష్టపోకూడదని చెప్పి..కేంద్ర ప్రభుత్వమే పోలవరం కట్టిస్తామని చెప్పింది..అలాగే జాతీయ హోదా ఇచ్చింది. అయితే కేంద్ర పరిధిలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదో ఏమో గాని..దాన్ని కావాలని టి‌డి‌పి హయంలో చంద్రబాబు తామే నిర్మిస్తామని తీసుకున్నారు. 2018లోనే పూర్తి చేస్తామని హడావిడి చేశారు. కానీ అది పూర్తి కాలేదు. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సైతం. అడపాదడపా పోలవరం పూర్తి […]

కృష్ణాలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ..వైసీపీకి మేలే.!

టి‌డి‌పి-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ అనధికారికంగా మాత్రం పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. రెండు పార్టీలు ఒకే లైన్ లో వెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. అందుకే అప్పుడే సీట్ల గురించి కూడా చర్చలు నడిచిపోతున్నాయి. ఇప్పటికే పలు సీట్ల కోసం అటు టి‌డి‌పి, ఇటు జనసేన నేతలు పట్టు పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో సీట్ల కోసం అప్పుడే పోటీ […]

గుడివాడ కోసం మరో కొత్త పేరు… టీడీపీలో నేతలే లేరా…?

గుడివాడ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నియోజకవర్గం. అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాంటి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. 2004లో టీడీపీ తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నాని… తర్వాత 2009లో కూడా టీడీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాత 2012లో వైసీపీలో చేరారు. ఉప ఎన్నికతో కలిపి ఇప్పటి వరకు వరుసగా 5 […]