ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు ఆగడం లేదు…. రోజుకో అక్రమం బహిర్గతమవుతోంది. బ్రతికున్న వారిని మరణించినట్టు చూపించడం, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించకపోవడం… ఇలా ఒకటి కాదు… కావాల్సినన్ని చిత్ర విచిత్రాలు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లు తొలగించడంతో పాటు… జీరో డోర్ నెంబర్లలో వందల సంఖ్యలో ఓట్లు కూడా ఉన్నాయి. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా చెట్లకు కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్కింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు […]
Category: AP
టీడీపీ – జనసేన మరో అడుగు… ముందుకు పడుతుందా…!?
తెలుగుదేశం, జనసేన మరో అడుగు ముందుకేశాయి. ఈ నెల 9వ తేదీన సమన్వయ కమిటీ భేటీ నిర్వహించి ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన, క్షేత్రస్థాయిలో సమన్వయంపై ప్రధానంగా దృష్టిసారించాలని నిర్ణయించారు. 9న జరగబోయే సమన్వయ కమిటీ భేటీలో వీటిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మధ్యంతర బెయిల్పై విడుదలై హైదరాబాద్లో విశ్రాంతిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ […]
ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్…!
నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా […]
సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల్లో ఉత్కంఠ..!
చంద్రబాబు కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే అంశం పై సుప్రీంకోర్టు వెలువరించే నిర్ణయం కోసం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయపక్షాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబు పై నమోదు చేసిన కేసులు చెల్లవని, 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేశారు. దీని పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. […]
రెండున్నర గంటల భేటీ… ఏం మాట్లాడుకున్నారో…?
జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్య దాదాపుగా రెండున్నర గంటలపాటు భేటీ జరిగింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలైన చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రధానంగా ఆంధ్రాలో భవిష్యత్తు రాజకీయం, ఉమ్మడి మ్యానిఫెస్టో, క్షేత్రస్థాయి పోరాటాలు వంటి అంశాల పై ఇరుపక్షాలు […]
వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై రాష్ట్ర ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది. రెండురోజుల క్రితం మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేయగా, తాజాగా ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని మరో కేసు నమోదు చేశారు. ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ ఆయనను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం వ్యూహం రూపొందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ను అధికార […]
వరుస రైల్వే ప్రమాదాలకు కారణాలేమిటీ…?
ఘోర ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖ గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు కనిపించడంలేదు. దీంతో అమాయక ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో మరోసారి రైల్వే అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో కంటకాపల్లి రైల్వేస్టేషన్ రక్తసిక్తమైంది. బాధితుల ఆహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అలమండ స్టేషన్ కి కూతవేటు దూరంలో రైలు ఆగింది. అంతలోనే ఒక్కసారిగా గుండె పేలిపోయినంత పనైంది. హాహాకారాలు, అరుపులు, […]
స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన…!
ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మరింత స్పీడ్ పెంచుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు పూర్తి అయిన అనంతరం ఇరుపార్టీల సమన్వయంతో వెయ్యి మందితో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ, జనసేన కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు రంగం […]
అచ్చెన్న ఎందుకిలా.. మరీ ఇలా అయితే ఎలా….?
కింజరాపు అచ్చెన్నాయుడు… రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. మాజీ మంత్రిగా.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గం నుండి వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. అయితే ఆయన తీరు మాత్రం సిక్కోలు జిల్లా పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఇందుకు కారణం ఆయన వ్యవహరిస్తున్న తీరే అంటున్నారు సిక్కోలు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ హవాలో సైతం వరుసగా రెండోసారి టెక్కలి నియోజకవర్గం నుండి విజయం సాధించారు అచ్చెన్న. ఉత్తరాంధ్ర […]