తీగ లాగితే డొంక కదిలింది అన్న చందాగా రౌడీ షీటర్ నయీమ్ ఎన్కౌంటర్ తరువాత రాజకీయ,పొలిసు వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.తాము పాలు పోసి పెంచిన పామే తమను కరుస్తుంది అన్న చందాగా తయారైంది నయీమ్ వ్యవహారం.చివరికి ఎవరికీ వారు మాకేపాపం తెలియదు అని బహిరంగంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే నయీమ్ తో సంబంధాలపై అందరికంటే ముందు వరుసలో వినిపిస్తోన్న పేరు మాజీ హోమ్ మంత్రి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పేరే.మాధవరెడ్డి ని ఎవరు,ఎలా […]
Category: Latest News
ఆన్ లైన్ పైనే మోజు అందని ఫించన్లు
ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్దారులు ఉన్నారు. ఆన్ లైన్ మోజులో ఆఫ్ లైన్ పై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో […]
మాగంటి గారి గెడ్డం నిరసన
స్వతంత్ర దేశంలో అహింసాయుత నిరసనల్లో ఇదో ట్రెండ్… మాగంటి గారి గెడ్డం నిరసన. ..ఏపీకి ప్రత్యేక హోదా విషయం రాష్ట్ర ఎంపీలను ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్… హోదాపై ఇప్పటి వరకు అనేక రూపాల్లో అధికార పక్ష ఎంపీలు, విపక్ష వైకాపా ఎంపీలు తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ఇక, వ్యక్తిగతంగా కూడా కేంద్రంపై నిరసన తెలిపేందుకు సిద్ధమైపోయారు అధికార పక్ష ఎంపీలు. ఇప్పటికే చిత్తూరు ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్.. […]
ట్విట్టర్ లో షాక్ ఇచ్చిన సుష్మా స్వరాజ్
ఈ మధ్య కాలంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను ట్విట్టర్ ద్వారా సమస్యల పరిష్కారం కోరడం ఎక్కువయిపోయింది. పాకిస్థాన్ కు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ కు ఆమె సాయపడడం, ఓ ముస్లిం జంటను కలపడంలో ఆమె సహకరించడం .. ఇవన్నీ చూసి ఓ కుర్రాడికి ఆమెను టీజ్ చెయ్యాలనిపించింది.. అంతే.. “నా కొత్త కారు పాడయిపోయింది, పొగ వస్తోంది, షాపు తీసికెళితే వాడు రీప్లేస్ చేయనంటున్నాడు.. నన్నేం చేయమంటారు, మీరో మాట చెబితే నాకు […]
కొరటాల జనతా గ్యారేజ్ – వర్మ శివ
జనతా గ్యారేజ్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ సినిమాల్లో ఉండే కలర్ షేడ్ కనిపిస్తోంది. అదే తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కనిపిస్తున్నాయి. దాంతో అలనాటి వర్మ ‘శివ’ సినిమా తరహాలో కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ని రూపొందించాడా? అని సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. అదే కనుక నిజమైతే అప్పట్లో వర్మ సినిమాలు సృష్టించిన సెన్సేషనే వేరు. అందులో ‘శివ’ సినిమా సంచలనం మరో ఎత్తు. ఇప్పటికే జస్ట్ టీజర్తోనే […]
రజనీకాంత్ బయోపిక్ వచ్చేస్తోందిట
రజనీకాంత్ బయోపిక్ని తెరకెక్కించడానికి ఆయన కుమార్తె ఐశ్వర్య సన్నాహలు చేస్తున్నారు. యంగ్ హీరో ధనుష్కి భార్య అయిన ఐశ్వర్య, ఇప్పటికే రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే తన తండ్రి, సూపర్ స్టార్ రజనీకాంత్కి దర్శకత్వం చేయడం రిస్క్తో కూడిన వ్యవహారమంటున్నారామె. చిన్నతనం నుంచీ తాను తన తండ్రిని చూస్తూ పెరిగాననీ, ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలూ, తాను పుట్టకముందు తన తండ్రి సినీ రంగంలో సాధించిన విజయాల్ని తెలుసుకుని, కొంత పరిశోధన చేసి బయోపిక్ […]
గ్యాంగ్స్టర్ నయీమ్ వెనుక అసలు దొంగలెవరు!
గ్యాంగ్స్టర్ నయీమ్ ఒక్కడే వేల కోట్ల ఆస్తుల్ని కూడగట్టలేడు. పెద్దల అండదండలు ఆయనకు పుష్కలంగా ఉండే ఉండాలి. వందలాది డాక్యుమెంట్లు ఆయన ఇంట్లో లభ్యమయ్యాయి. ఇంకా ఆయన అనుచరుల ఇళ్ళలో డాక్యుమెంట్లు దొరుకుతున్నాయి. నయీమ్ అనుచరులెందరో లెక్క తేల్చడమే పోలీసులకు కష్టంగా మారింది. తవ్వుతున్న కొద్దీ నయీమ్ బాగోతాలు కొత్త కొత్తగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. నయీమ్ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి అనేంతలా ఆయన చుట్టూ ఓ పెద్ద కోట ఉంది. ఆ కోటని […]
జగన్ కొత్త గెటప్ వెనుక రాజకీయ కోణం
అధికారంలో ఉన్నవారెవరైనాసరే కులమతాలకతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని మతాల పండుగల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఆయా మతాచారాల ప్రకారం వ్యవహరిస్తారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నవారికి అవన్నీ చేయాలని రూలు ఏమీ లేదు. ఆయా మతాల పండుగల్లో పాల్గొనడం వేరు, ఆ మతాచారాల్ని పాటించడం వేరు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, క్రిస్టియానిటీని విశ్వసిస్తారు. అలాగని ఆయన ఇతరమతాలకి వ్యతిరేకి కాదు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లి, ‘విశ్వాసం’ తెలపలేదనే […]
కాశ్మీర్ ఉగ్రవాది పాక్ లో హీరో
భారత భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ బుర్హాన్ వనీ.. హీరోలా చూస్తోంది పాకిస్థాన్. ఇండియా ఎంత చెబుతున్నా వినకుండా.. వనీ విషయంలో కలగచేసుకుంటోంది. అతను యువతకి స్ఫూర్తి అంటూ.. ప్రచారం చేస్తోంది. గురువారం ‘ఆజాదీ ఎక్స్ప్రెస్’ పేరుతో ఓ రైలును ప్రారంభిస్తోంది పాకిస్థాన్. ఈ రైలు బోగీలపై వనీ ఫొటోలను అంటించింది. వనీతోపాటు కాశ్మీర్లో హింస బాధితుల ఫొటోలనూ రైలు బోగీలకు అంటించింది. ఈ రైలును పాక్ రైల్వే మంత్రి ఖాజా సాద్ […]