‘తిక్క’కి లెక్కలు చూపించే టైమొచ్చింది

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ. ‘సుప్రీం’ సినిమా ముందు వరకూ తేజుది ఒక లెక్క, ఆ సినిమా తర్వాత ఇంకో లెక్క. ఎందుకంటే ‘సుప్రీం’ సాధించిన సంచలన విజయం అలాంటిది. మామూలు టాక్‌తోనే పెద్ద హిట్‌ సాధించింది ‘సుప్రీం’. దాంతో, భారీ ఆఫర్లతో ‘తిక్క’ని దక్కించుకున్నారట కొందరు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా రిలీజ్‌కి ముందు పాజిటివ్‌ బజ్‌ రావడంతో, సాయిధరమ్‌ ప్రీ రిలీజ్‌ ప్రాఫిట్స్‌ని ‘తిక్క’తో నిర్మాతకి అందించాడు. […]

మాట తప్పేది లేదంటున్న కెసియార్‌

ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషనుల ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పునరుద్ఘాటించారు. గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినా న్యాయస్థానాల్లో ఆ కేసులు వీగిపోయాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో వెనక్కి తగ్గేది లేదని ఇంకోసారి చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రత్యేక చట్టం తెస్తామని ఆయన అంటున్నారు. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడానికి రెండేళ్ళకుపైగానే కెసియార్‌ సమయం తీసుకున్నారు. […]

అమరావతిని అడ్డుకోవద్దు: సుప్రీంకోర్టు

కొత్త రాష్ట్రం రాజధానిని నిర్మించుకోవద్దా? అని సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎబికె ప్రసాద్‌ని ప్రశ్నించింది. అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును కొట్టివేసిన న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్లో, అనేక కీలకాంశాలు ఉన్నాయి. రాజధానిని ఎక్కడ నిర్మించాలో మీరే చెబుతారా? మీరేమైనా రైతా? అని ప్రశ్నించడంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి నోట మాట రాలేదు. రైతులు నష్టపోతున్నారని ఆయన చెప్పినప్పుడు, రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు […]

బాబూ పుష్కర పుణ్యం మాకొద్దు

గత నెల రోజులుగా పాలనా పడకేసిన పట్టించుకోకుండా పుష్కర పనులకే పరిమితమయింది ప్రభుత్వమంతా..అక్కడికేదో చరిత్రలో ఇదే మొదటిసారి పుష్కారాలు అన్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గరినుండి మంత్రిమండలి మొదలు అధికార యంత్రాగమంతా పనులుమానుకొని మరీ రాష్ట్రం లో పుష్కరాలు తప్ప వేరే పనిలేదు అన్నట్టుగా హడావిడి చేశారు.ఈ పైత్యం ఏ రేంజ్ కి చేరిందంటే అదేదో ఫామిలీ ఫంక్షన్ అన్నట్టు మంత్రివర్యలచే ఆహ్వానాలు అందిచిందడం ఈ మొత్తం వ్యవహారానికి పరాకాష్ట. ఏర్పాట్లు అయితే ఘనంగానే చేశారు కానీ జనాలు మాత్రం […]

దేవాలయాలు కూడానా కెసిఆర్ గారూ

కెసిఆర్ లోని ఉద్యమనేత ఇంకా చల్లారినట్లు లేడు.అయన ఇప్పుడో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అప్పుడప్పుడు నేనింకా ఉద్యమనేతనే అని అందరికి గుర్తు చేస్తుంటారు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్.ఉద్యమనేతగా చాలా కలం కొనసాగి ఆ అలవాట్లు ఇంకా పోలేదో లేక నేను ముఖ్యమంత్రినైనా నాలో ఉద్యమ నాయకుడే ఎప్పుడు ముందుంటాడని చుపించాడానికో తెలీదు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఏకంగా బంద్ కి పిలుపునివ్వడం ఎక్కడైనా చూశామా.అది కేవలం కెసిఆర్ కె సాధ్యం.ఖమ్మం జిల్లా లోని 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో […]

న‌యీం దందా 700 కోట్లు!

గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీమ్ దందాలు ఆక్ర‌మ‌ణ‌లు పోలీసుల విచార‌ణ‌లో త‌వ్వేకొద్దీ బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బెదిరింపుల‌కు పాల్ప‌డి అన‌తికాలంలోనే వంద‌ల ఎక‌రాల‌ను నయీం క‌బ్జాచేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే న‌యీం దాదాపు 433 ఎక‌రాల‌ను త‌న భార్య, త‌ల్లి, అనుచ‌రుల పేర్ల మీద‌కు బ‌ద‌లాయించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. వీటి విలువ వంద‌ల కోట్ల‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెవెన్యూ ఇత‌ర ప్ర‌భుత్వాధికారుల స‌హ‌కారం లేనిదే భూముల బ‌ద‌లాయింపు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌దు కాబ‌ట్టి ఇందులో వీరిపాత్ర కూడా ఉండొచ్చ‌న్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు […]

అసెంబ్లీ స్థానాలు పెంచం రెండోస్సారి!

ఎన్ని సార్లు చెప్పాలి యువరానర్ పెంచము..పెంచము..పెంచము గాక పెంచము..ఇది తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం వైఖరి.అయినా పట్టువదలని విక్రమార్కుల్లా పాపం ఆంధ్ర,తెలంగాణా పాలకులు పోరాడుతూనే వున్నారు.ఇదేదో ప్రజా ప్రయోజనం కోసం అనుకుంటే పొరపాటే..కేవలం పార్టీ ఫిరాయించి నిస్సిగ్గుగా అధికార పార్టీ లో చేరిన వారిని కాపాడుకుందుకే ఇంత తాపత్రయం. ఇప్పటికే కేంద్రం ఎన్నో సార్లు నియోజక వర్గాల పెంపు 2024 వరకు సాధ్యమయ్యే పరిస్థితి లేదని డంకా బజాయించి మరీ చెప్పింది.అయినా ప్రజా ప్రతినిధుల […]

సంక్రాంతికి చిరంజీవి సినిమా పక్కా

చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా ‘కత్తిలాంటోడు'(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాకి నిర్మాతగా రాంచరణ్‌ పని చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అంటున్నారు. కానీ నిర్మాత రాంచరణ్‌ మాత్రం ఎలాగైనా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో ఉన్నాడట. అంతేకాదు ఒక పక్క తాను ‘ధృవ’ సినిమాలో నటిస్తూనే ఈ సినిమా కోసం కూడా ప్లానింగ్స్‌ వేస్తున్నాడు. […]

కెసియార్‌ టీడీపీని ఇలా కూడా దెబ్బకొడుతున్నారా?

గ్యాంగ్‌స్టర్‌ నయీం బతికొచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేడు. పోలీసులు ఏం చెబితే అదే నిజం అనుకోవాలి. ప్రభుత్వం ఎలా చెబితే పోలీసులు అలా నివేదిక ఇస్తారు. ఇదీ విపక్షాల ఆరోపణ. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత పోలీసు, రాజకీయ వర్గాల్లో సునామీ మొదలైంది. ఈ సునామీలో ఎవరు కొట్టుకుపోతారో తెలియడంలేదు. పోలీసులు సేఫ్‌ అవ్వాలంటే అధికార పార్టీ చెప్పినట్లు పోలీసులు వ్యవహరించాలని హుకూం జారీ అయినట్లుగా పరిస్తుతులు కానవస్తున్నాయంటూ రాజకీయ వర్గాలలో […]