మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈ నెల 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ సినిమా పై విష్ణు ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు కన్నప్పకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్నీ రివీల్ చేయనున్నట్లు ఇప్పటికే అటు విష్ణు.. ఇటు మోహన్ బాబు.. ఇద్దరు ప్రమోషన్స్ లో ఎన్నోసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా పై ఆడియన్స్లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో.. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్కు కన్నప్ప టీం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ సినిమా గురించి కానీ.. ప్రొడ్యూసర్, వాటాదారుల పరువుకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరించినా.. ఎలాంటి ట్రోల్స్ చేసిన కఠిన చర్యలు తప్పవని.. లీగల్గా యాక్షన్ తీసుకుంటామంటూ క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటికే.. ఈ మూవీ నుంచి సాంగ్స్, టైలర్లు రిలీజ్ కాగా.. సినిమా పై పీక్స్ లెవెల్లో హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. అదే రేంజ్లో డైలాగ్స్, ట్రోల్స్, మీమ్స్ కూడా వచ్చాయి. ఇక విష్ణు చెప్పిన శివయ్య డైలాగ్ ని అయితే ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ట్రోల్స్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అయిన ఘటనను కూడా కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ తెగ ట్రెండ్ చేశారు. ఈ ట్రోల్స్ అన్నిటిపై ఎన్నో సందర్భాల్లో మంచు విష్ణు స్వయంగా రియాక్ట్ అయ్యాడు.
తన మనోభావాలను దెబ్బతీస్తున్నారని వివరించాడు. అంతేకాదు.. మూవీని బ్యాన్ చేయాలంటూ బ్రాహ్మణ సంఘాల వివాదంపై కూడా విష్ణు చాలా మంచిగా క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. సినిమా రివ్యూ రాసే వాళ్ళు, క్రిటిక్స్ అందరూ ముందు సినిమాను చూసి పూర్తిగా అర్ధమైన తర్వాత దానిపై రియాక్ట్ అవ్వాలని.. కన్నప్ప టీం వివరించింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్రానర్ పై నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు బిజినెస్ సైతం అదే రేంజ్లో జరిగిందంటూ టాక్ నడుస్తుంది. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.