టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతా మెగాస్టార్గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రిలోకి రావాలని ఆశపడే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారాడు చిరు. ఇక తన సినీ కెరీర్లో 150 కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న ఈయన.. తాజాగా మల్లిడి వశిష్్ఠ డైరెక్షన్లో విశ్వంభర సినిమా షూట్ ను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు.. ఇంకా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించింది లేదు.
ఈ క్రమంలోనే చిరంజీవి మరో ప్రాజెక్టుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. సెట్స్లో పాల్గొన్నాడు. మెగా 157 రన్నింగ్ టైటిల్తో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా మెరవనుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు మేకర్స్. బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను అనిల్.. ఫుల్ ఆఫ్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ఎలాగైనా మెగాస్టార్కు సాలిడ్ హిట్ ఇచ్చి.. మరోసారి తన కెపాసిటీ ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో పెద్దగా సాంగ్స్ ఉండే ఛాన్స్ లేదట. అయితే.. నయన్, చిరు మధ్య మాత్రం ఓ సాంగ్ పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీని కోసమే అద్భుతమైన ట్యూన్ ను సెట్ చేసే పనిలో అనిల్ బిజీ అయినట్లు సమాచారం. వీరిద్దరిపై అదిరిపోయే లెవెల్లో సాంగ్ క్రియేట్ చేయాలని పట్టుదలతో పనిచేస్తున్నాడట. ఇక ఇప్పటికే మెగాస్టార్, అనిల్ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ తో ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఎప్పుడెప్పుడు సినిమా షూట్ పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటికే టీం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాలో రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మూవీ సాంగ్ విషయంలో అనిల్ ప్లాన్ అసలు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.