టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. జూన్ 12 న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా.. ఈ సినిమా తర్వాత ఓజి సెట్స్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు పవన్. సుజిత్.. డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటికే ప్రకటించి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఇక సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే పవన అభిమానులకు ఒకే ఏడాదిలో డబ్బల్ ధమాకా అంటూ.. కచ్చితంగా రెండు సినిమాలు మంచి బ్లాక్ బస్టర్లు కొట్టి పవన్ మార్కెట్ మరింతగా పెరగడం పక్క అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే పవన్ ఓజీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాల్లో నారా రోహిత్ కాబోయే భార్య.. చంద్రబాబు కోడలు.. శిరీష లెల్ల కీలకపాత్రలో కనిపించనున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. కాగా శిరీష లెల్ల, నారా రోహిత్కు గత కొద్ది రోజుల క్రితమే గ్రాండ్ లెవెల్ లో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రతినిధి 2 సినిమా షూట్ టైంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ జంట ఇటీవల ఎంగేజ్మెంట్తో వాళ్ల రిలేషన్ను ప్రకటించారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో త్వరలో వివాహానికి సిద్ధమవుతున్నారు.
ఇలాంటి క్రమంలో శిరీష.. పవన్ ఓజి సినిమాలో నటించనుందని.. చంద్రబాబు కోడలు పవన్ సినిమాలో మెరుస్తుందంటూ న్యూస్ తెగ వైరల్గా మారుతుంది. ఇక పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో.. ఇప్పటికే పూర్తవ్వాల్సిన సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. కాగా.. తాజాగా ఇటీవల మళ్ళీ షూటింగ్ ప్రారంభించిన టీం.. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించిన వెంటనే.. ప్రమోషన్స్ తో హైప్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా పూర్తై.. రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.