టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ.. తిరుగులేని క్రేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు హిట్ సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం అఖండ 2 తాండవం సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. కాగా.. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, క్రిష్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించినున్నాడట. ఇలాంటి క్రమంలోనే బాలయ్య భార్య వసుంధరకు భయపడి.. బాలయ్య ఓ స్టార్ హీరోయిన్ను పక్కన పెట్టేసాడంటూ టాక్ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో క్రిష్.. బాలకృష్ణ డైరెక్షన్లో గౌతమీపుత్ర శాతకర్ణ మూవీ తెరకెక్కించి.. మంచి సక్సెస్ అందుకున్నారు.
మళ్లీ వీళ్ళ కాంబోలో మరో సినిమా తీసుకురావాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో.. సినిమా స్టోరీ లైన్ కూడా బాలకృష్ణకు చెప్పడం.. ఆయనకు నచ్చేయడంతో లైన్ ఇంప్రూవ్ చేసుకుని.. ఫుల్ స్టోరీతో రమ్మని చెప్పాడట. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్ని కూడా ఫిక్స్ చేశానని.. ఆమె హనీ రోజ్ అంటూ క్రిష్ వివరించడంతో.. వద్దు బాబోయ్ ఆమెను తీసేసి మరో హీరోయిన్ పెట్టండి. ఇప్పటికే హాని రాజ్తో నటించాను కదా.. ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టేసి ఉంటుందని క్రిష్కు చెప్పి పంపించాడట. కాగా.. ఇక్కడ అసలు మ్యాటర్ అది కాదని.. హనీ రోజ్ను బాలయ్య వద్దని చెప్పడానికి కారణం వసుంధరానే అని తెలుస్తుంది.
గతంలో వీరసింహారెడ్డి సినిమా టైంలో బాలయ్య, హాని రోజ్కు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలపై వసుంధర ఫైర్ అయ్యి బాలకృష్ణ పై ఆలిగి గొడవ చేసిందట. ఇకపై ఆమెతో ఏ సినిమా చేసిన ఒప్పుకోనని.. ఇలా క్లోజ్ గా ఎప్పుడు కనిపించినా అసలు సహించేది లేదని మొండికేసిందట.. అప్పట్లో ఈ న్యూస్.. ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ గా మారింది. అయితే.. ఈ భయంతోనే క్రిష్ సినిమాలో సైతం హనీ రోజ్ను వద్దని.. బాలయ్య డైరెక్టర్కు చెప్పేసినట్లు సమాచారం.