‘ హరిహర వీరమల్లు ‘కు బిగ్ షాక్.. ఫైనల్ అవుతుందనుకుంటే.. కొత్త పంచాయతీ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప‌ట్టాలెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో ఒడుదుడుకలను ఎదుర్కొంటూనే ఉంది. ఎప్పుడో 2020లో అఫీషియల్‌గా ప్రకటించిన ఈ సినిమా అప్పటినుంచి ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇప్పటికే పలు మార్లు రిలీజ్ అనౌన్స్ చేసిన వాయిదా పడుతూనే వచ్చింది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో.. సినిమా షూటింగ్ పూర్తికాలేదు. మొదట ఈ సినిమాలో కొంత భాగాన్ని క్రిష్ రూపొందించగా.. ఆయన మ‌ధ్య‌లో క్విట్ కావడంతో జ్యోతి కృష్ణ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించాడు. పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా కనపడనున్న ఈ సినిమాలో.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా మెరవనుంది.

ఇక మొదటి సినిమాను మార్చ్ 28న‌ రిలీజ్ చేయాలని భావించగా.. అది వాయిదా పడి కొత్త రిలీజ్ డేట్కు వచ్చింది. ఇక తాజాగా జూన్ 12న ఈ సినిమా రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా టీం ప్రకటించారు. అయితే ఇప్పుడు జూన్ 12న అయినా వీరమల్లు వస్తుందా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. కారణం జూన్ 1 నుంచి సినిమా ధియేటర్లు బంద్ చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల సినీ ఎగ్జిబిటర్లు తీసుకున్న కీలక నిర్ణయమే. అద్దె ప్రతిపాదికన సినిమాలను ప్రదర్శించుకోలేమని.. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శించుకుంటామంటూ నిర్మాతలకు ఎగ్జిబిటర్లు లేఖ రాయాలని.. తీర్మానం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే జూన్ 1 నుంచి సినిమా ధియేటర్లను బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక జూన్‌లో హరిహర వీరమల్లతో పాటు.. థ‌గ్‌లైఫ్, కన్నప్ప, కుబేర, కింగ్‌డ‌మ్ లాంటి భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. జూన్ 1 నుంచి సింగల్ స్క్రీన్ సినిమా ధియేటర్లు బంద్ అవుతున్న నేపథ్యంలో.. ఆ ప్రభావం ఈ సినిమాలపై కూడా పడనుంది. ఇక’ హరిహర వీరమల్లు స కొత్త పంచాయితి ఎప్ప‌టికి తేలుతుందో వేచి చూడాలి.