టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. కమిట్ అయినా సినిమాలను ఫినిష్ చేసే పనిలో కష్టపడుతున్నాడు పవన్. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేతగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. నిర్మాతలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట కోసం ప్రాజెక్ట్లను చకచకా ఫినిష్ చేసేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఓజి, ఉస్తాద్ భగత్సింగ్, హరిహర వీరమల్లు సినిమాలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాలు ఎన్డిఏ కూటమి అధికారంలోకి రావడం.. పవన్ రాజకీయాల్లో బిజీగా గడపడంతో ఆగిపోయాయి.
ఇప్పుడు కాస్త గ్యాప్ దొరకడంతో షూటింగ్స్ ను మొదలుపెట్టిన పవన్.. వరుసగా అన్ని సినిమాలను ముగించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఆయన ఓజీ అలాగే హరి హర వీరమల్లు సినిమా షూట్లను బ్యాలెన్స్ చేస్తూన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా హరిహర వీరమల్లు సినిమా తన పాత్ర షూట్ కంప్లీట్ చేసుకున్న పవన్.. సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమా సెట్స్ లో సందడి చేయనున్నాడు. ఇక ఈ సినిమా షూట్ వీలైనంత త్వరగా పూర్తిచేసుకుని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని టీమ్ ఎంతో కసిగా పనిచేస్తున్నారు. పవన్ తన డేట్స్ స్పెషల్గా కేటాయించి మరి ఈ సినిమాను పూర్తిగా ముగించే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓజీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది.
ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. పవన్ పాత్రలో ఎన్నో మలుపులు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ ఉండనున్నాయని.. సినిమాలో ట్రస్టులకు ఆడియన్స్ ఫీజులు ఎగిరిపోవడం ఖాయమంటూ టాక్ వైరల్గా మారుతుంది. ఇక సుజిత్ చివరిగా సాహో సినిమాతో ఫ్లాప్లు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓజితో బలమైన కమ్ బ్యాక్ ఇవ్వాలనే కసితో సినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్, ట్విస్ట్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తుందట. గతంలో కూడా ఇలాంటి ట్రిస్టులు కొన్ని సినిమాల్లో వచ్చిన ఓజి సినిమాలో మాత్రం ఈ ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉండనుందని సమాచారం. అంతే కాదు.. ఈ క్లైమాక్స్ ఎమోషనల్గా రూపొందించనున్నారట. థియేటర్లలో ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. మరి ఓజి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి ఫ్యాన్స్కు పవన్ ఫుల్ మిల్స్ ఇస్తాడా.. లేదా.. వేచి చూడాలి.