తెలుగు ఇండస్ట్రీలో.. స్టార్ట్ దర్శకుల సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు మరో ఎత్తు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న కూడా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నాడు.
ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్లో సినిమాకు సంబంధించిన వీడియో లేటెస్ట్ గా రిలీజై ఆడియన్స్ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 తర్వాత.. ఏకంగా హాలీవుడ్ అభ్యర్థులతో అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించనున్నాడని.. అఫీషియల్గా తేలిపోయింది. ఇంతేకాదు.. మరొ పక్క రాంచరణ్, బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ద సినిమా ఫస్ట్ షాట్ కూడా ఆకట్టుకుంది. పెద్ది సినిమా రేంజ్ మరింత ఎదిగింది. ఈ క్రమంలోనే రెండు భారీ సినిమాల నుంచి వచ్చిన వీడియోస్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఎస్ఎస్ఎంబి 29 పై కూడా అప్డేట్ ఇస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక దర్శకుడు రాజమౌళి కనుక.. కంటెంట్, ఎగ్జిక్యూషన్, మేకింగ్, టేకింగ్లో ఎలాంటి సందేహం ఉండదు. కానీ.. పెద్ది, ఏఏ 22 వీడియోస్ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా.. తమ హీరో సినిమా అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే జక్కన్న సైతం సినిమా కోసం ఒక రెండు నిమిషాలు వీడియోను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడంటూ టాక్ నడుస్తుంది. ఆ వీడియోతో తన విజన్ ఏంటో.. ఆడియన్స్కు మరోసారి పరిచయం చేయనున్నాడట. తప్పకుండా ఈ అప్డేట్ చూసే ఆడియన్స్ అంతా.. అది రాజమౌళి స్టామినా అనే లెవెల్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయ్యేలా ఆ వీడియోను డిజైన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంత సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.