నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ కింగ్ నాగార్జున మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా పరిణామాలతో మరోసారి వీళ్ళిద్దరి వివాదం హట్ టాపిక్గా మారింది. బాలయ్యకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో బాలకృష్ణకు ఇండస్ట్రీ నుంచి అందరూ విషెస్ తెలియజేశారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు, రాజకీయంగా ప్రజలకు అందించిన ఎనలేని సేవలకు మంచి గుర్తింపు వచ్చిందంటూ అంతా అభివర్ణిస్తూ ప్రసంసలు కురిపించారు.
ఆయన కృషిని తెలియ చేశారు. చిరంజీవి, వెంకటేష్, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చరణ్, అల్లు అర్జున్, రవితేజ ఇలా ప్రతి ఒక్కరూ చిన్న హీరోల నుంచి పెద్ద హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, దర్శకుల వరకు అంతా విషెస్ ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే నాగార్జున మాత్రం ఇప్పటివరకు బాలయ్యకు కనీసం విషెస్ కూడా తెలియజేయలేదు. చిరు, నాగ్, బాలయ్య, వెంకీ సీనియర్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వీరిలో అత్యున్నత పురస్కారాలు చిరు, బాలయ్యలకు వరించాయి.
మహాన్ బాబుకు పద్మశ్రీ వచ్చినా.. వెంకటేష్, నాగార్జునలకు ఎలాంటి పద్మ అవార్డులు దక్కలేదు. ఈ క్రమంలోనే తమ పట్ల చిన్నచూపుతోనే తమకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని.. తమకు సరైన గుర్తింపు రావడం లేదని ఆలోచనలో.. నాగార్జున ఉన్నాడట. అందుకే బాలయ్యకు విషప్ కూడా తెలియజేయలేదని అంటున్నారు. అవతేకాదు నాగార్జున గతంలో అవార్డులో అందుకున్న వాళ్లకు కూడా ఎలాంటి విషెస్ చెప్పలేదు. ఇక నేడు రిపబ్లిక్ డే సందర్భంగా నాగ్ అభిమానులు, ప్రజలకు విషెస్ చెబుతూ ట్విట్ చేశారు. కానీ బాలయ్య పద్మ విభూషణ్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే వీళ్ళ మధ్యన విభేదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.