టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర బ్లాక్ బస్టర్ అందుకుని.. మంచి ఫామ్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ వార్ 2 షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు తారక్. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో మరో సినిమా రూపొందనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబో ఫిక్స్ అయినట్లు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
టైటిల్ మేకర్స్ వెల్లడించకున్నా.. డ్రాగన్ పేరుతో ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన వార్తలు తెగ వైరల్గా మారుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా సినిమా షూట్కు సిద్ధమవుతుందని సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరగనుంది అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. ఇక సినిమాలో హీరోయిన్గా సప్త సాగరాలు ఫేమ్ రుక్మిణి వసంత్ నటించిన మరో హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందనను తీసుకొనున్నట్లు సమాచారం. అయితే ఇక ఈ సినిమాలో తారక్ మునుపేన్నడు చూడని రోల్లో పవర్ఫుల్ యాక్షన్తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని ప్రశాంత్నీల్ ఇలీవల హింట్ ఇచ్చారు.
అంతేకాదు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్గా మారుతుంది. సినిమాలో ఇద్దరు మలయాళ స్టార్ నటులు చోటు దక్కించుకున్నారని సమాచారం. వాళలో ఒకరు బీజు మీనన్, మరొకరు టోపీనో థామస్. ఇండస్ట్రీలో వీళ్ళు బెస్ట్ యాక్టర్స్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక వీరిద్దరి రాకతో ఈ సినిమాకు అక్కడ ఇండస్ట్రీలో కూడా సినిమాపై మంచి హైప్ నెలకొంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను మైత్రి మూవీస్, ఎన్టీఆర్ యాడ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇక ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి వార్ 2 రానుంది. మరో నాలుగు నెలల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం అవుతుంది.