తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కీసులాట్ట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రేవతా అనే మహిళా మృతి చెందడంతో.. ఈ కేసులో నిందితుడిగా అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సినిమాలు చూసేందుకు బన్నీ ఫ్యామిలీతో కలిసి సంధ్య థియేటర్ కు వెళ్లడం.. అల్లు అర్జున్ రాకతో జనం అంతా చూసేందుకు ఎగబడగా తొక్కిసలాటలో రేవతి అని మహిళా ఊపిరాడక మరణించింది.
అయితే ఇంత ఘోరానికి కారణం థియేటర్ యాజమాన్యం, బన్నీ, అతని టీం అంటూ పోలీసుల అభియోగించడంతో కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. విచారణలో భాగంగా కొద్దిసేపటి క్రితం పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. కాగా.. అరెస్ట్ చేసే క్రమంలో వారికి చిన్న గొడవ జరిగిందట. పోలీసులు మా డ్యూటీ మేము చేస్తున్నామని వివరించారు. మీ డ్యూటీ మీరు చేయడం.. నన్ను తీసుకెళ్లడం.. తప్పు కాదు. కానీ బెడ్ రూమ్ వరకు వచ్చేయడం టూ మచ్ అంటూ అల్లు అర్జున్ తన అసహనం వ్యక్తం చేశాడు. అది మంచి విషయం కాదని చెప్పుకొచ్చాడు. టెన్షన్ పడుతున్న తన భార్య అల్లు స్నేహకి ఏం కాదు.. అన్నట్లుగా ధైర్యం చెప్పి ఆమెకు ప్రేమగా ముద్దిచి పోలీసులతో అల్లు అర్జున్ బయలుదేరాడు.
వెంట అల్లు అరవింద్ వెళ్ళాలని ప్రయత్నించగా.. బన్నీ తండ్రితో కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు. మంచైనా, చెడైనా నాకే రానివ్వండి అంటూ తండ్రితో ధైర్యం చెప్పి.. అల్లు అర్జున్ కాఫీ తాగి పోలీసులతో వెళ్లిపోయాడు. అయితే అరెస్టు అయిన కొద్దిసేపటికి బన్నీ తరపున న్యాయవాది హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలా చేయగా పిటిషన్ ని సోమవారం విచారిస్తామని కోర్టు వెల్లడించింది.