అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన అప్డేట్లు ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు నాగ చైతన్య మొదటి పెళ్ళికి సంబంధించి సమంతకు సంబంధించిన వార్తలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక శోభిత, నాగచైతన్య ఈ ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో సింపుల్గా వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శోభిత, చైతన్య ఫొటోస్ కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇక తనకు పూర్తిగా దూరమైపోతాడని భావించిన సమంత.. నాగచైతన్య చివరి జ్ఞాపకాలను కూడా కాల్చేసి బూడిద చేసేసిందట. ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. వీరి ప్రేమ మొదలైంది ఏం మాయ చేసావే సినిమా షూట్ సమయం నుంచి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏం మాయ చేసావే షూట్ టైం లో ఫస్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ నటించే అప్పుడు స్నాప్ అయినా పిక్చర్ ఆమె చాలా జాగ్రత్తగా దాచుకుందట. ఈ ఫోటో పై సమంత, అదే విధంగా నాగచైతన్య లిప్ మార్క్స్ కూడా గుర్తుగా ఉంచుకున్నారట.
అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత.. నాగచైతన్య జ్ఞాపకాలు అన్నిటిని దూరం చేసుకున్నా ఈ ఫోటోలు మాత్రం మెమొరబుల్ గా ఎంతో ఇష్టంగా తన వద్ద ఉంచేసుకుందట. అయితే మరికొద్ది రోజుల్లో చైతన్య భార్యగా శోభిత,, అక్కినేని ఇంట్లోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలోనే ఇకపై చైతన్యకు సంబంధించిన ఏ మెమోరి తన దగ్గర ఉండకూడదనే ఉద్దేశంతోనే.. ఆ ఫోటోని కూడా మిగల్చకుండా కాల్చేసిందట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సమంత, చైతు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత అభిమానులు చైతు కారణంగా.. సమంత ఎంతో వేదన అనుభవించిందని.. ఇప్పటికే అనుభవిస్తూనే ఉందంటూ చైతన్య పై మండిపడుతున్నారు.