బాక్సాఫీస్ దండయాత్ర సై అన్న టాలీవుడ్ స్టార్స్‌… పై చేయి ఎవ‌రిది..?

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ హీరోలుగా ఇమేజ్ సొంతమైన తర్వాత వారికి ఉండే ఫ్యాన్ బేస్.. చిన్న చిన్న హీరోలకు ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో రాంచరణ్, ప్రభాస్, అల్లుఅర్జున్, పవన్, ఎన్టీఆర్, మహేష్ బాబు మొదటి వరుసలో ఉంటారు. తమదైన స్టైల్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న ఈ హీరోలు.. ఎప్పటికప్పుడు తమ స్థాయిని మరింతగా పెంచుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్‌లు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

The RajaSaab Motion Poster | Prabhas | Maruthi | Thaman S | TG Vishwa Prasad | People Media Factory - YouTube

ఇక మిగతా మీడియం రేంజ్‌ హీరోలు వాళ్లకు ఉన్న క్రేజ్‌ రిత్యా.. తమను తాము ఎలివేట్ చేసుకుంటూ మంచి కథలను ఎంచుకొని సక్సెస్ సాధించేందుకు ఆరాట‌డుతున్నారు. ఇక ఒక స్టార్ హీరో నుంచి సినిమా వస్తే ఏ రేంజ్ లో ఆడియన్స్ లో హైప్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే హీరోస్ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎంచుకుంటూ పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మన టాలీవుడ్ స్టార్ హీరోస్ అంతా ఒకేసారి రంగంలోకి దిగిపోతున్నారు.

Pawan Kalyan's Hari Hara Veera Mallu Sets Release Date

ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరిలో అల్లు అర్జున్ పుష్ప 2తో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుక రాంచరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ప్రభాస్ నుంచి రాజా సాబ్, పవ‌ర్ స్టార్ నుంచి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కూడా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఇలా వరుసగా హీరోలందరూ ఈ ఏడాది ఒకరి తర్వాత ఒకరు తమ సినిమాలను రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ దండయాత్రకు సై అంటున్నారు. ఇక వీరిలో ఈసారి పై చేయి ఎవరిది అవుతుందో వేచి చూడాలి.