టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోలు ఏజె ఇజ్ జస్ట్ ఏ నెంబర్ అని నిరూపించారు. యంగ్ హీరోల కంటే వేగంగా సినిమాలో నటిస్తూ బిజీ లేనప్తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో నందమూరి నటసింహం బాలయ్య మొదటి వరుసలో ఉంటారు. ఇటీవల హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్లో ఉన్న బాలయ్య.. ఒక ప్రాజెక్టు తర్వాత మరొకటి అన్నట్లుగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య.. బాబి డైరెక్షన్లో 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమా షూట్ పూర్తి కాకుండానే.. ఆయన తన 110వ సినిమాను అనౌన్స్ చేశారు. డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో అఖండ తాండవం సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవల దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్న బాలయ్య.. ఈ సినిమాతో పాటు చాలా సినిమాలను లైన్లో పెట్టాడని వార్తలు వినిపించాయి. వాటిలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని టాక్ నడిచిన దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే బాలయ్య ఒక క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడు అంటూ.. మరో తాజా న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే బోయపాటితో కాకుండా.. ఇప్పటికే ఆయనకు బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఇచ్చిన మరో ఇద్దరి దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందులో ఒకరు వీర సింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాగా.. మరొకరు భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి అని సమాచారం.
ఈ ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు బాలయ్యతో సినిమా తీసేందుకు కథలు సిద్ధం చేసుకున్నారని.. గోపీచంద్, బాలయ్యకు కథను వినిపించగా ఆయన వెంటనే నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ సన్నిడీయోల్తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య తో చేయబోయే సినిమాపై ఫోకస్ చేస్తాడట. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గతంలో భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్యకు సూటయ్యే విధంగా మరో అద్భుతమైన కథను రాసుకున్నాడట. ప్రస్తుతం వెంకటేష్ సినిమా చేస్తున్న అనిల్.. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే నటసింహంతో సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారని సమాచారం. అయితే ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో ముందు ఏ ప్రాజెక్టులో బాలయ్య నటిస్తాడు చూడాలి.