పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్తో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ది రాజాసాబ్ పై ప్రేక్షకులలో ఆశక్తి నెలకొంది. మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టీజే విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైప్ మరింతగా పెంచాడు. ఆడియన్స్ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నా.. అంతకుమించి అనేలా సినిమా ఉంటుందని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడిప్పుడే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేందుకు మేకర్స్ సన్నాహలు చేస్తున్నారు.
మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా అయినా.. ఇప్పటివరకు టచ్ చేయని జానర్లో ప్రభాస్ కనిపించబోతున్నాడని.. కామెడీతో ఎంటర్టైన్ చేయబోతున్నాడని టాక్. అంతేకాదు థమన్ రాజాసాబ్పై రియాక్ట్ అవుతూ.. ప్రభాస్ పై మంచి డ్యాన్స్ నంబర్స్ కూడా ఉంటాయంటు వెల్లడించడు. ఇలా టీం మొత్తం సినిమాపై ఏదో విధంగా ఇంట్రెస్ట్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నైజాం థియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ కమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయినా మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. భారీ ధరకు ఈ రైట్స్ మైత్రి సంస్థ కొనుగోలు చేసిందట. హైదరాబాద్లో సంధ్యా 70mm రాజాసాబ్ ను లాక్ చేసినట్టు సమాచారం.
అలాగే మిగిలిన ఏరియాలోను థియేట్రికల్ రైట్ కు ఫుల్ డిమాండ్ పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. ఏప్రిల్ 10, 2025లో గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఐదు భాషల్లో ఆల్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా దాదాపు రూ.400 కోట్ల రేంజ్ లో జరిగే అవకాశం ఉందట. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారు. సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ నెలఖరుకుకి షూట్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందట. రొమాంటిక్, కామెడీ హారర్ థ్రిల్లర్గా ది రాజసం ఆడియన్స్ ముందుకు రానుంది. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా రిసల్ట్ ను బట్టి కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి.