యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తరికెక్కిన తాజా మూవీ దేవర బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. పిల్లలనుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. మొదట మిక్స్డ్ టాక్ వచ్చినా.. మెల్లమెల్లగా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకొని దేవర దూసుకుపోతుంది. దాదాపు అన్ని ఏరియాలో ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి లాభాల బాటలో నడుస్తుంది. కొన్ని ఏరియాలో దేవరకు ఇప్పటికీ వరుస కలెక్షన్ల వర్షం కురుస్తుంది.
దాదాపు అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిన క్రమంలో.. సినిమా నిర్మాతల కంటే ఓ వ్యక్తికే దేవరవల్ల ఎక్కువ లాభం కలిగిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అతను ఎవరో కాదు డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ. నిర్మాతల కంటే ఈ సినిమాపై లాభం నాగవంశీకే ఎక్కువగా వచ్చిందట. రెండు తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్గా నాగవంశీ వ్యవహరించారు. కాగా.. అవుట్ రేట్కు నాగ వంశీ హక్కులను కొనుగోలు చేసి.. ఏరియాలవారీగా అమ్మిన క్రమంలో.. ఓవర్ ప్లోస్ అన్ని నాగవంశీకే వస్తాయని సమాచారం. సితార బ్యానర్.. నిర్మాత నాగవంశీ గతేడాది లియో సినిమాతో భారీ సక్సెస్ అందుకొని లాభాలను పొందారు.
కాగా.. ఈ ఏడాది కూడా దేవర సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా మరోసారి సక్సెస్ అందుకున్నారు. ఏపీలో దేవర టికెట్ రేట్లు భారీగా పెరిగిన క్రమంలో సినిమాకు లాభాలు తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్ తో పాటు.. నాగ వంశీ కూడా పవన్కు మంచి సన్నిహితుడు కావడంతో.. దేవర ఫస్ట్ డే టికెట్ల రేట్లు పెంపు సాధ్యమైంది. దీంతో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కాగా.. ఇప్పటివరకు దేవరా శాటిలైట్ డీల్ పూర్తి కాలేదు. ఏ ఛానల్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేస్తుందో.. వేచి చూడాలి. ఇక శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ మొత్తం వస్తే నిర్మాతల భారీ లాభాలను కళ్ల చూస్తారు అనడంలో సందేహం లేదు. బడ్జెట్ పరంగా దేవర విషయంలో నిర్మాతలు ఎక్కడ రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ల కంటే ఎక్కువగా దేవర పార్ట్ 1 నాగవంశీకి ప్లస్ అయిందట.