దివంగత అందాల తార సౌందర్యకు టాలీవుడ్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌందర్య తర్వాత తన సహజనటనతో లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సౌందర్య.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. 1992లో కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. పేరుకు కన్నడ సోయోగమైన తెలుగు వారిలో కలిసిపోయి తెలుగు అమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు సడన్గా 2004లో విమాన ప్రమాదంలో కన్నుమూసి అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది.
అయితే 100కు పైగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌందర్యకు.. నటనపై అసలు ఆసక్తి లేదట. ఈ విషయాన్ని స్వయంగా తనకు క్లోజ్ ఫ్రెండ్ అయినా ఆమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సౌందర్య, ఆమని కన్నడ వాళ్లే కావడంతో ఇద్దరి మధ్యన మంచి స్నేహం బలపడింది. దీంతో సౌందర్యకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలు ఆమనితో షేర్ చేసుకునేదట. ఒక నిమిషం సౌందర్య తన తండ్రి బలవంతం పై ఇండస్ట్రీకి వచ్చిందని చెప్పిన ఆమని.. తండ్రి చనిపోయిన తర్వాత అన్నయ్యను అదే రేంజ్లో గౌరవించేదని చెప్పుకొచ్చింది.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అందరిలాగా సాధారణ లైఫ్ లీడ్ చేయడం అంటే ఇష్టమట. పెళ్లి చేసుకుని.. పిల్లలు కని.. గృహిణిగా ఉండాలని సౌందర్య కోరిక. నటిగా ఎంతో కీర్తి గడించిన సౌందర్య కోరిక తీరకుండానే చనిపోయింది అంటూ ఆమని తన ఆవేదనను వెల్లడించింది. 2003 ఏప్రిల్ నెలలో జీ. రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సౌందర్య.. పెళ్ళి అయిన ఏడాదిలోపే ఆనంతలోకాలకు వెళ్లిపోయింది. కోరుకున్న జీవితం అనుభవించక ముందే చనిపోయింది.