టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట బాల నటుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం గ్లోబల్ స్టార్గా దూసుకుపోతున్నాడు. ఇక ఎలాంటి డైలాగ్ అయినా అలవోకగా చెప్పడం ఆయనకువెన్నతో పెట్టిన విద్య. అలా స్క్రీన్ పై తన పర్ఫర్మెన్స్తో లక్షలాదిమంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ మాస్ హీరో.. ఓ సినిమా షూట్ వేసిఎంలో సగం సినిమా పూర్తయిన తర్వాత.. ఈ సినిమా నేను చేయను అంటే.. చేయనంటూ.. ఫైర్ అయ్యాడట. మొండికేసి కూర్చున్నాడంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. తారక్ ఎందుకు అంతగా సినిమా చేయనని మొండికేసాడు ఒకసారి తెలుసుకుందాం. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి బాల రామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చోటు చేసుకుందట. ఎన్టీఆర్ నటన సామర్థ్యాన్ని బాల నటుడుగా ఉన్న సమయంలోనే చాటి చెప్పిన మూవీ ఈ బాల రామాయణం.
ఎమ్ఎస్రెడ్డి ప్రొడ్యూసర్ గా, గుణశేఖర్ దర్శకత్వం వ్యవహరించిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. చిన్నారులకు వినోదం పంచిన ఈ సినిమా ఉత్తమ బాలల సినిమాగా జాతీయ అవార్డును దక్కించుకుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ బాలరాముడిగా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే రామాయణం బుక్ లో చదివినంత సులభమేం కాదు. భారీ భారీ డైలాగ్స్.. చిన్నపిల్లల నోటి నుంచి వింటుంటే ఆంతరు ఆశ్చర్యపోయారు. ఎంతో అద్భుతంగా ఉన్నాయంటూ మెచ్చుకున్నారు. అయితే చిన్న పిల్లలతో ఇంత భారీ భారీ డైలాగ్స్ చెప్పించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక ఈ సినిమా షూట్ టైంలో ఎవరూ ఒక్క దగ్గర కూడా కుదురుగా కూర్చున్న వారు కాదట. మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో బుద్దిమంతుడు.. రాముడు పాత్ర పోషించిన ఎన్టీఆర్ అయితే.. తెరవెనక మాత్రం కృష్ణుడి కంటే ఎక్కువగా అల్లరి చేస్తూ చిలిపి చేష్టలు చేసేవాడట. ఈ మూవీలో శివధనర్భంగం సన్నివేశం కోసం దర్శకుడు ప్రత్యేకంగా టేకుతో విల్లును తయారు చేయించి దాంతో పాటు సేఫ్ సైడ్ గా మరో డూప్లికేట్ విల్లుని కూడా చేపించి పెట్టాడట.
అయితే షూటింగ్ జరిగే టైంలో మూవీ టీం మొత్తం సన్నివేశం కోసం సిద్ధమవుతుండగా.. ఎన్టీఆర్ మిగతా పిల్లలతో ఆడుతూ డూప్లికేట్ వీల్లు లేపే ప్రయత్నం చేశాడట. అది బరువు తక్కువ ఉండడంతో తేలికగా లేపేసాడట. ఇదే కాన్ఫిడెన్స్ తో తారక్ అసలైన విల్లు వెతికి దాన్ని లేపడానికి కూడా ప్రయత్నించాడట. తారక్ తో పాటు.. అక్కడ ఉన్న మిగిలిన పిల్లలు మొదట విల్లు ఎత్తడానికి ప్రయత్నించి చేతకాక పక్కన పెట్టేస్తే.. తారక్ మాత్రం కష్టపడి ఆ విల్లుని పైకి ఎత్తడు.. కానీ బ్యాలెన్స్ తప్పడంతో విల్లు తో సహా కింద పడిపోయాడు. అలా ఆ విల్లు విరిగిపోయిందట. దీంతో తారక్ పై కోపంతో ఊగిన గుణశేఖర్.. ఎన్టీఆర్ను విపరీతంగా తిట్టారట. దీంతో ఎన్టీఆర్ నేను అసలు సినిమా చేయనంటే చేయనంటూ వెళ్ళిపోతానని తెగ మారం చేశాడట. మొండికేశాడట. ఫైనల్ గా అందరూ సర్ది చెప్పడంతో ఈ సినిమాలు కంప్లీట్ చేశాడట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ చిలిపి అల్లర్లు వింటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.