గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించిన తర్వాత ఇండస్ట్రీకి దూరమై.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. ఆమె ఒకప్పటి ఫేమస్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నటించింది అతి తక్కువ సినిమాల్లో అయినా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తన నటనతో ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది. కేవలం రెండే రెండు సినిమాల్లో నటించిన అవి కూడా తమిళ్ సినిమాలు. అయితే ఈ రెండు సినిమాలు తెలుగులోనూ డబ్బ్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో టాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ ముద్దుగుమ్మ తల్లి, అక్క కూడా సినిమాల్లో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ముఖ్యంగా తల్లి 90వ దశకంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవికి పోటీగా చిందులు వేసి అభిమానులను ఆకట్టుకునేది. ఈ అమ్మడి అక్క పలు సూపర్ హిట్ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. రెండు సినిమాలకే ఇండస్ట్రీ నుంచి సర్దుకుంది. హీరోయిన్గా అమ్మడికి సరైన సక్సెస్ అందకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన ఈ బొద్దుగుమ్మ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. అది కాస్త కష్టమే లేండి మేమే చెప్పేస్తాం.

ఆమె మరెవరో కాదు అలనాటి అందాల తార రాధ‌.. రెండో కూతురు తులసి నాయర్. రాధ మొదటి కూతురు కార్తీక కూడా హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. జీవా హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ రంగంతో ఈ అమ్మడికి మంచి పాపులారిటి దక్కింది. అంతకుముందు నాగచైతన్య డెబ్యు మూవీ జోష్‌లోను ఈమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తులసి నాయిర్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన కడలి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో యాన్ అనే మరో తమిళ సినిమాలోని నటించింది. దీన్నే రంగం2గా తెలుగులో డబ్ చేశారు. ఈ అమ్మడు రెండు సినిమాల తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగయింది. ఇక ఇటీవల అక్క పెళ్ళిలో మెరిసిన ఈమె ఫొటోస్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. ఏంటి తిను తులసి నాయర్ ఆ.. రంగం 2 హీరోయినా అంటూ అవ్వకౌతున్నారు.