ఒకరు హీరోగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న ఈ ఇద్దరు అన్నదమ్ములను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అంతేకాదు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ న‌టించిన‌ వాళ్ళు కూడా కాస్త గ్యాప్ త‌ర్వాత‌ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు అన్నారు. మ‌రి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తర్వాత కెరీర్ పై ఫోకస్ చేస్తూ.. ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. అయితే గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ అందుకున్న వారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో ఉంటూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే పై ఫోటోలో కనిపిస్తున్న అన్నదమ్ముల ఫోటోలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా దూసుకుపోతున్నారు. ఒకరు హీరోగా.. మరొకరు మ్యూజిక్ డైరెక్టర్గా.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఎవరో చెప్పలేదు కదా.. టాలీవుడ్ స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కొడుకులు జై సింహ, కాలభైరవ. వీరిద్దరి గురించి దాదాపు తెలుగు ఆడియ‌న్స్ అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో చాలా మంది ఫేవరెట్ సీరియల్ అయినా అమృతం సీరియల్ లో ఇద్దరు అన్నద‌మ్ముళ్లు.. చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించారు.

అలాగే శ్రీ సింహ యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ప్రస్తుతం కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసింది. అలాగే చిన్న కొడుకు జైసింహ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్గా తెరకెక్కిన మత్తు వదలరా 2 లో జైసింహ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఇప్పటికే భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా కాలభైరవ వ్యవహరించారు. ఇలా ఒకేసారి ఇద్దర అన్నదమ్ములకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందడంతో.. ప్రస్తుతం వీరిద్దరి చిన్ననాటి ఫోటో నెటింట‌ వైరల్ గా మారుతుంది.