టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన మూవీ సరిపోద్దా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 29న (రేపు) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీలో.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా కనపడనుంది. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా హైయెస్ట్ బడ్జెట్తో.. అత్యంత భారీ కాన్వాస్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య.. ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే సరిపోద్దా శనివారం నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. అయితే సినిమా టీమ్ అంతా ప్రమోషన్స్ లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. విడుదలకు మరికొద్ది గంటలే ఉండడంతో తాజాగా నానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక సినిమాపై నాని కి ఉన్న డెడికేషన్ ఏంటో ఈ సంఘటనతో తెలిసిపోతుంది.
ఇంతకి మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా.. సరిపోదా శనివారం మూవీ షూట్ టైంలో వివేకాత్రేయ అనారోగ్యానికి గురయ్యారట.. నాని ఈ క్రమంలో విరామం లేకుండా ఏకంగా 40 గంటల పాటు కంటిన్యూస్గా వర్క్ చేసినట్లు ఓ పోస్ట్ తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నాని అభిమానులతో పాటు.. నెటిజన్స్ అంతా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వర్క్ డెడికేషన్ అంటే ఇదేగా.. అంటూ సినిమాపై ఉన్న పిచ్చి ఏంటో నాని ఈ పనితో ప్రూవ్ చేసుకున్నాడు అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక తాజాగా నానికి సంబంధించిన ఈ పోస్ట్.. ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు అనే ట్యాగ్ తో వైరల్ గా మారుతుంది.