టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాల తర్వాత స్టార్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి మెగాస్టార్ పొజిషన్లో ఉన్న కొత్త నటులను ప్రోత్సహించడానికి ముందు వరసలో ఉంటాడు. మంచి సినిమా ఏదైనా వస్తే చాలు చిరు మూవీ యూనిట్ని ప్రత్యేకంగా ఆహ్వానించి మరి అభినందిస్తాడు. నటులలో టాలెంట్ను ప్రోత్సహించే చిరంజీవి ఎవరి సినిమా అయినా నచ్చితే వారికి ఫోన్ చేసి మరి అభినందిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని ప్రతి సినిమాను కూడా చిరంజీవి చూస్తారంటూ న్యూస్ తాజాగా తెగ వైరల్ అవుతుంది. వెంటనే నానికి.. చిరు స్వయంగా తన సినిమా ఎలా ఉందో టైప్ చేసి మెసేజ్ పంపుతారట. ఈ విషయాన్ని నాని స్వయంగా సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా వివరించాడు. దసరా సినిమాకు ఫోన్ చేసి మరి ఆయన అభినందించారని.. ఇక ఓసారి చిరంజీవిని నాని కలిసినప్పుడు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారంటూ వివరించాడు. ఇక నాని, సాయి పల్లవి జంటగా నటించినా శ్యామ్ సింగరాయ్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలను తెచ్చి పట్టింది. అయితే చిరంజీవికి ఈ సినిమా విపరీతంగా నచ్చేసిందట. ఈ సినిమాను తన భార్య సురేఖతో కలిసి హోం థియేటర్లో చూసినట్లు చిరు వివరించారట. ఈ సినిమాలో బాగా లీనమైన ఆయన.. నీ పర్ఫామెన్స్ బాగా నచ్చిందని నానికి చెప్పినట్లు వివరించాడు. మధ్యలో సిబ్బంది స్నాక్స్ తీసుకొస్తే.. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని తిట్టి పంపించేశానని.. అంత బాగా సినిమా నచ్చిందంటూ చిరంజీవి నానితో వివరించాడట. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి చిరు దంపతులు తనతో ఎంతో సేపు మాట్లాడారని.. ఒక ఫ్లాప్ సినిమా ఇంతగా నచ్చిందని చెప్పడంతో వారి మాటలకు ఫిదా అయ్యానంటూ నాని ప్రమోషన్స్ లో వెల్లడించాడు.