టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎంతోమంది నటులు అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే తమ సినిమాలతో సంచలనం క్రియేట్ చేసిన నటులు కూడా ఉన్నారు. ఆర్తి అగర్వాల్ కూడా ఆ లిస్టులోకే వస్తుంది. పాగల్ అనే హిందీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్.. కె.విజయభాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిననువ్వు నాకు నచ్చావు సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ జంటగా ఈ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తన మొదటి సినిమాతోనే లక్షల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆర్తి.. ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో వరుస సినిమా ఛాన్స్లను కొట్టేసింది.
మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున ఇలా దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత నువ్వు లేక నేను లేను, సోగ్గాడు సినిమాలో నటించి మెప్పించింది. ఈ క్రమంలో వీరిద్దరూ లవ్ లో పడ్డారని.. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని అయితే కుటుంబ సభ్యులు ఈ ప్రేమను అంగీకరించకపోవడంతో వీరిద్దరు దూరం అవ్వాల్సి వచ్చిందని.. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన ఆర్తి తన కెరీర్ స్పాయిల్ చేసుకుందని కామెంట్లు వినిపించాయి. ఇక తరుణ్ – ఆర్తిలు అసలు ప్రేమించుకోలేదని.. తను ఆర్తిని ప్రేమించి ఉంటే కచ్చితంగా వారిద్దరికీ పెళ్లి చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా నిర్మాత చంటి అడ్డాల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆమె తండ్రి అంటూ చేసిన కామెంట్స్ నెటింట సంచలనం సృష్టిస్తున్నాయి. అల్లరి రాముడు సినిమాలో ఎన్టీఆర్కి జంటగా చార్మి నటించాల్సింది.. అయితే ఆర్తి అగర్వాల్ను తీసుకున్నాం. ఇక అదే బ్యానర్లో అడవి రాముడు సినిమా కూడా ఆర్తి నటించిన సంగతి తెలిసిందే. ఆర్తి సెట్స్ లో చాలా హుషారుగా ఉండేదని.. వాళ్ళ నాన్న వస్తే ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుందని.. ఆమె తండ్రి ప్రభావం తనపై అంతలా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది.
సినిమాల ఎంపికతో పాటు.. కెరీర్ విషయంలోనూ తండ్రే నిర్ణయాలు తీసుకునే వాడని.. తన తండ్రి కారణంగానే ఆమె డిప్రెషన్కు వెళ్లి ఇంతగా ఆమె నష్టపోవాల్సి వచ్చిందంటూ చంటి అడ్డాల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ డిప్రెషన్ తోనే బరువు పెరిగి షేప్ అవుట్ అయిన ఆర్తి అగర్వాల్.. కెరీర్లో అవకాశాలు పూర్తిగా నెమ్మదించాయి. ఇక 2007లో తండ్రి చూసినా అబ్బాయిని వివాహం చేసుకున్న ఆర్తి.. 2009లో అతనికి విడాకులు ఇచ్చేసింది. తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించినా 2011 తర్వాత నాలుగేళ్లు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ఇక 2015లో బరువు తగ్గేందుకు లైబోసెక్షన్ సర్జరీ చేయించుకుంది అది వికటించడంతో ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే.