సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక షాకింగ్ సంగటనలు జరుగుతూనే ఉంటాయి. అలా ఆగస్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సినిమాను డిసెంబర్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 29న రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ ను ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేసేలా నిర్ణయించారు మేకర్స్. పూరి జగన్నా డైరెక్షన్లో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వల్ గా ఈ సినిమా రూపొందింది. నిజానికి డబ్బుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేసిన సమయానికి చిన్న సినిమాలు గాని పెద్ద సినిమాలు కానీ ఏవి పోటీకి రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మిస్టర్ బచ్చన్ సినిమా డబ్బుల్ ఇస్మార్ట్ సినిమాకు పోటీగా తీసుకువస్తున్నారు.
ఓ రకంగా రవితేజ, పూరి జగన్నాథ్ మద్యన మంచి బాండింగ్ ఉంది. కానీ.. పూరి జగన్నథ్ డైరెక్షన్లో సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా పోటీకి రావడం ఇప్పుడు అందరికీ షాక్ ని ఇస్తుంది. అంతేకాదు మిస్టర్ బచ్చన్ సినిమాకు డైరెక్టర్గా హరిష్శంకర్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక హరిష్శంకర్ కూడా గతంలో పూరి జగనాథ్ దగ్గర కొన్ని సినిమాలకు పని చేశాడు. వాళ్లది గురుశిష్యుల అనుబంధం అని చెప్పవచ్చు. ఇప్పుడు గురువుతో శిష్యుడు పోటీ పడుతున్న క్రమంలో డబ్బుల్ స్మార్ట్ మూవీ నిర్మాతల్లో ఒకరైన చార్మి హీరో రవితేజ తో పాటు హరీష్ శంకర్కు కూడా షాక్ ఇచ్చిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది.
చార్మి.. రవితేజా, హరీష్ శంకర్ సోషల్ మీడియా ఎకౌంట్లను అన్ ఫాలో చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట చర్చినియాంశంగా మారింది. నిజానికి డబ్బుల్ ఇస్మార్ట్ సినిమా హిట్ అవ్వడం రామ్తో పాటు పూరి జగన్నాథ్, ఛార్మికి చాలా అవసరం. ఇలాంటి టైం లో మరో పెద్ద సినిమాను పోటీకి తీసుకురావడం అనేది ఛార్మికు అసలు నచ్చలేదట. ఈ క్రమంలో రవితేజ.. హరిష్ శంకర్ సోషల్ మీడియా ఎకౌంట్లను అన్ ఫాలో చేసిందంటూ కామెంట్లో వినిపిస్తున్నాయి. అయితే నిజానికి మిస్టర్ బచ్చన్ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి అసలైన కారణం ఓటీటీ ప్లాట్ ఫామ్స్తో జరిగిన డీల్ అట. వాళ్ల ఒత్తిడి వల్లే ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.