న‌మ్ర‌త వ‌ల్ల ఫ్లాప్ అయ్యిన మ‌హేష్ సినిమా ఏదో తెలుసా..?

టాలీవుడ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ వుందో తెలిసిందే. ఈ కుటుంబం నుంచి దివంగత సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈరోజు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్ లో 29వ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక మాజీ మిస్ ఇండియా మాజీ బాలీవుడ్ నటి అయిన నమ్రతా శిరోద్కర్‌ను మహేష్ బాబు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి బి. గోపాల్ దర్శకత్వంలో 2000 లో వచ్చిన వంశీ సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత 2005లో వీరిద్దరూ ముంబైలో పెళ్లి చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో నమ్ర‌తను.. మహేష్ సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది అని ప్రశ్నిస్తే.. మురారి, ఒక్కడు, శ్రీమంతుడు, పోకిరి, అతడు సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపింది.

మరి వంశీ సినిమా అంటే ఇష్టం లేదా..? అంటే మహేష్ సినిమాలలో వంశీ అంత ప్రత్యేకమైన సినిమా కాదని చెప్పింది. వంశీ సినిమాని గాలికి వదిలేసి మీ ఇద్దరూ ప్రేమలో పడిపోయారా..? అని యాంకర్ ప్రశ్నిస్తే సరదాగా అవును అని నవ్వుతూ బదిలించింది. అంటే మహేష్ నమ్ర‌త‌తో ప్రేమలో పడటం వల్ల సినిమా మీద వీరిద్దరూ సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేదా..? అసలు ఏం జరిగిందన్నది పక్కన పెడితే.. వంశీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది.