రవితేజ సింధూరం హీరోయిన్ సంఘవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఏం చేస్తుందంటే..?

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ నటించిన తాజ్‌మహల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సంఘవి. మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. త‌న‌ అందం, అభినయంతో అందరిని కట్టిపడేసింది. అయితే ఈ అమ్మడి అసలు పేరు కావ్య రమేష్. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్ ప్రారంభంలో తన పేరున సంఘవిగా మార్చుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా త‌న‌ అందం, అభినయంతో రాణించిన వారిలో సంఘవి కూడా ఒకటి.

Sanghavi

అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. రెండు దశాబ్దాలుగా నార్త్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో ఆకట్టుకుంది. ఇక కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కిన సింధూరం సినిమాతో అమ్మడికి మంచి పాపులారిటీ ఏర్పడింది. రవితేజ, బ్రహ్మాజీ ప్రధాని పాత్రలో నటించిన ఈ సినిమా 1997లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సంగవికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

Sangavi Recalls Having Two Miscarriages, "There Was No ...

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు సరసన నటించే ఆఫర్ కొట్టేసిన సంఘవి.. అప్పట్లో టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీగా క్రేజ్ అందుకుంది. సింధూరం సినిమాకు నంది అవార్డ్‌ కూడా దక్కింది. తర్వాత ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. అయితే వివాహం మాత్రం ఆలస్యంగానే చేసుకుంది. 2016లో ఐటి ఉద్యోగి వెంకటేష్‌ను వివాహం చేసుకున్ని ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంఘవి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంది.