మహేష్ – రాజమౌళి కాంబోలో విలన్ గా ప్రభాస్ ప్రాణ స్నేహితుడు.. స్టార్ హీరో ఎవరంటే..?

స్టార్ హీరో మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో త‌న 29వ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. యాక్షన్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జక్కన్న తెర‌కెక్కించనున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన లుక్ ను కూడా మార్చుకున్నాడు. బరువు పెరగడంతో పాటు హెయిర్ స్టైల్ లో కూడా ఎన్నో మార్పులు చేసాడు మహేష్.

SSMB 29: Is SS Rajamouli really considering Hollywood actors for Mahesh  Babu's film? | Telugu Movie News - Times of India

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్. నారాయణ భారీ బడ్జెట్లో సినిమాను ప్రొడ్యూస్ చేయ‌నున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్‌ పైకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాజమౌళి నటీనటుల ఎంపిక విషయంలో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబి 29 లో మహేష్ కు పోటీగా విలన్ పాత్రలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు నటించబోతున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రాణ స్నేహితుడు మహేష్‌కు విలనా.. ఇంతకీ ఆ ప్రాణ స్నేహితుడు ఎవరు అనుకుంటున్నారా..?

Prithviraj says 'Salaar' co-star 'Prabhas fools you into believing he is  laid back' | Exclusive - India Today

అతను మరెవరో కాదు సలార్ సినిమాతో మంచి సక్సెస్ సాధించి త‌న న‌ట‌న‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌. సలార్‌లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా పృథ్వీరాజ్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 లో మహేష్ కు పోటీగా విలన్ పాత్రలో పృథ్వీరాజ్ నటించనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పృధ్వీరాజ్ ఇటీవల ది గోట్ లైఫ్ సినిమాతో భారీ సక్సెస్ అందుకొని మంచి ఫామ్ లో దూసుకుపోతున్న‌ సంగతి తెలిసిందే.