నందమూరి నట వారసుడిగా మూడోతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తారక్.. తనదైన రీతిలో వరుస సినిమాలను నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న తాజా సినిమా దేవరా. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సముద్రపు నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా రెండు పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేవర విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీఆర్.. ఆ ఒక్క విషయంలో మాత్రం భయపడుతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం. దేవర నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ప్రేక్షకులో సంచలనం సృష్టిస్తుంది. అయితే తాజాగా అనిరుధ్ మ్యూజిక్ లో వచ్చిన ఒక సాంగ్ మాత్రం ప్రేక్షకులను ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. కారణం అనిరుధ్ మ్యూజిక్ లో సంగీతం మాత్రమే వినిపిస్తుందని.. లిరిక్స్ అసలు అర్థం కావడం లేదట. చాలామంది అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి.
మరి దానికి తగ్గట్టుగా సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే. ఇక సాంగ్స్ విషయంలోనే.. మ్యూజిక్ దగ్గర కొంచెం డల్ గా ఉన్నట్లు ఈ విషయంపైనే ఎన్టీఆర్ కూడా కాస్త భయపడుతున్నట్లు సమాచారం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుధ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు.. ఈ సినిమా సక్సెస్ కు ఆ మ్యూజిక్స్ ఎంతలా హెల్ప్ చేసింది అనేది రిలీజ్ తర్వాతే తెలియాల్సి ఉంది. అయితే గతంలో అనిరుధ్ చేసిన అజ్ఞాతవాసి మ్యూజిక్ అసలు సెట్ కాలేదు సరి కదా సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే అనిరుధ్ దేవర సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం.. ఆ మూవీ నుంచి వచ్చిన మ్యూజికల్ వీడియోస్ సక్సెస్ అందకపోవడంతో తారక్ అభిమానుల్లో కూడా దేవర విషయంలో ఆందోళన మొదలైందట.