సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న హీరోలు, హీరోయిన్ల నుంచి స్టార్ దర్శకుల వరకు సెలబ్రెటీస్ ప్రతి ఒక్కరికి ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే సినీ సెలబ్రెటీల కు సంబంధించిన త్రో బ్యాక్ ఫొటోస్ థీమ్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా.. ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్న ఓ క్రేజి డైరెక్టర్ ఫోటో నెటింట వైరల్ అవుతుంద. ఇంతకీ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తుపడితే నిజంగానే మీరు జీనియస్.

పెద్దపెద్ద హీరోలు కూడా ఆయన డేట్స్ కోసం ఎదురు చూసే రేంజ్ కు ఎదిగారు. తీసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతి సినిమాతోను సంచలనం సృష్టించారు. ఇప్పటికైనా ఆయన ఎవరో గుర్తుపట్టారా.. సర్లేండి మేమే చెప్పేస్తాం. ఆ సెన్సేషనల్ డైరెక్టర్ మరెవరో కాదు.. ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్కు పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తను ఎన్నో హిట్లు కొట్టాడు.

యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ సిరీస్లతో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా సంచలనం సృష్టించాడు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. సలార్ కూడా భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ లైన్లో ఉంది. కాగా.. ప్రస్తుతం నీల్ – ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి క్రమంలో.. ప్రశాంత్ నీల్ త్రో బ్యాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అయితే.. ఈ వీడియోని చూసిన చాలా మంది అసలు నిజంగానే ఇతను ప్రశాంత్ నీలా.. కాదా.. అనే సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram

