టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా.. రెండు, మూడు బ్లాక్ బస్టర్లు అందుకున్న ముద్దుగుమ్మలంతా బాలీవుడ్కు చెక్కేసి అక్కడ సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకొని.. అక్కడ సినిమాల్లో సక్సెస్ లేక.. తిరిగి టాలీవుడ్కు వద్దామంటే అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫెడవుట్ అయిపోతున్నారు. అలా.. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రీ లీల కూడా బాలీవుడ్లోకి అడుగు పెట్టారు. ఇక పూజ హెగ్డే బాలీవుడ్లో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం శ్రీ లీల.. బాలీవుడ్లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవి ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక లేటెస్ట్గా యూత్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి సైతం బాలీవుడ్లో అడుగు పెట్టడానికి సిద్ధమయ్యింది.
వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఆమెకు వెయ్యుకోట్ల ప్రాజెక్టులో పవర్ఫుల్ క్యారెక్టర్ లో అవకాశం వచ్చిందని టాక్. స్త్రీ 2, మీమీ, చావా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రొడ్యూసర్.. మడాక్ ఫిలిమ్స్ అధినేత.. దినేష్ విజన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైలర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మీనాక్షి హిరోయిన్గా మెరువనుందట. ఇక హీరో, ఇతర కాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా నిజంగానే ఈ ప్రాజెక్టు మీనాక్షి చౌదరి క్లిక్ అయితే మాత్రం అమ్మడి దశ తిరిగిపోతుంది అనడంలో సందేహం లేదు.
బాలీవుడ్లో సక్సెస్ అందుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు మన ఇండియన్ సినీ ఇండస్ట్రీలలో.. అన్నిటికంటే టాలీవుడ్ పెద్దది. టాలీవుడ్ సినిమాల నుంచి అధిక వసూలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు సైతం మన నిర్మాతలు, డైరెక్టర్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రమంలో.. టాలీవుడ్ నుంచి ముద్దుగుమ్మలు మాత్రం బాలీవుడ్ కి వెళ్లడం తెలివి తక్కువ చర్య అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ లో అందుకున్నా.. ఈ సినిమాల హిట్ల కంటే కెరీర్లో ఫ్లాప్ల శాతం ఎక్కువ ఉంది. ఇలాంటి క్రమంలో మీనాక్షికి వెయ్యి కోట్ల ప్రాజెక్టా అసలు ఆమెకు అంత సీన్ ఉందా అంటూ ఫైర్ అవుతున్నారు.