సినీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన నటీనటుల పై ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇక హీరోయిన్ల పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత ఎలాంటి పుకార్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లకు పెళ్లి కాక ముందు పలువురు హీరోలతో ఎఫైర్ల వార్తలు వినిపించడం కామన్. అలాగే పెళ్లయిన హీరోయిన్లకు గర్భం దాల్చారు అంటూ పుకార్లు కామన్. అయితే గతంలో బాలీవుడ్లో ఇలాంటి పుకార్లు ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు టాలీవుడ్ లోను ఇదే తరహా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఒకేసారి టాలీవుడ్కు సంబంధించిన ఇద్దరు హీరోయిన్లపై ప్రెగ్నెన్సీ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఆ ఇద్దరు హీరోయిన్లు మరెవరు కాదు.. శోభిత ధూళిపాళ్ల అక్కినేని, లావణ్య త్రిపాఠి కొణిదెల. వరుణ్ తేజ్, లావణ్య 2023లో ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు కానున్నారని.. త్వరలోనే న్యూస్ అఫీషియల్ గా మెగా ఫ్యామిలీ ప్రకటించబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్న లావణ్య.. ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన క్రమంలో.. అమ్మడు గర్భం దాల్చడం వల్లే సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య ప్రేమించి ఆరు నెలల కిందటే వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు శోభిత ధూళిపాళ్లపై కూడా గర్భం దాల్చిందంటూ పుకార్లు వైరల్ గా మారుతున్నాయి. అయితే గర్భం దాల్చినట్లు పుకార్లకు కారణం.. వేవ్స్ 2025 సమ్మిట్లో భర్త నాగచైతన్యతో కలిసి హాజరైన శోభిత చీరకట్టు. ఆమె చీరకట్టు డిఫరెంట్ గా ఉండడంతో.. బాలీవుడ్ మీడియా దీనిని హైలెట్ చేసింది. దీంతో ఈ పుకార్లు ప్రారంభమయ్యాయి. ఇక శోభిత కూడా సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వడంతో ఈ ప్రెగ్నెన్సీ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది.