ముంబై వేదికగా 2025 వేవ్స్ సమ్మిట్ గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో నటి శోభాత దూలిపాళ్ళ భర్త నాగచైతన్యతో కలిసి సందడి చేసింది. ఇందులో శోభిత.. అభిమానులతో కలిసి ఫోటోలకు రకరకాల ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కాగా.. ఇక్కడ హైలెట్ ఏంటంటే.. శోభిత కట్టిన చీర కాస్ట్. సింపుల్ లుక్తో ఆకట్టుకుంటున్న ఈ చీర ధర ఏకంగా రూ.4 లక్షల కావడం. ఎందుకంత స్పెషల్ అంటే.. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీని రూపొందించడమే.
ఇక ఈ ఆలీ ఉగ్రేన్ టిష్యూ ఎంబ్రాయిడరీ చీర సెట్లో శోభిత అద్భుతంగా మెరిసింది. దీని విలువ అక్షరాల రూ.3,95,000 అని తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే శారీ స్పెషలిటీ.. కాస్ట్ వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. ఈ చీర స్పెషాలిటీస్ ఏంటంటే స్టైలిష్ట్ అమీ పటేల్ చేత అలంకరించబడిన గోధుమ బంగారు రంగు ఎంబ్రాయిడరీతో.. వినూత్నమైన శైలిలో రూపొందించడం.
అంతేకాదు చీరకు మ్యాచింగ్ అలీవ్ గ్రీన్ బ్లౌజ్తో శోభితకు పర్ఫెక్ట్ గా ఉండేలా డిజైన్ చేయడం. అందుకు తగ్గట్టు ఆమె జుట్టును క్రిస్పీ బన్తో కొప్పు చుట్టుకొని.. నుదుట ఎర్రటి సింధూరంతో.. అభిమానుల మతిపోకూడతుంది. ఇక మొదట నుంచి గ్లామరస్ లుక్లో హాలీవుడ్ రేంజ్లో ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో.. లేటెస్ట్ లుక్స్ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చీరకట్టు చూశాక ఆమెపై అభిప్రాయం మారిపోయిందని.. అందమైన చీరలో.. అద్భుతమైన లుక్తో తగిన ఆభరణాలు వేసుకుని.. రాజరిక వైబ్ను తీసుకుని వచ్చిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
✨ @SobhitaD in @MMalhotraworld Olive Green Tissue Embroidered Saree (₹395,000) attends the Inaugural Ceremony of #WAVES2025 in Mumbai – Styled by Ami Patel.#SobhitaDhulipala #ManishMalhotra #WAVESummit pic.twitter.com/BeKN7xDXz0
— Preetham S (@PrithamSadashiv) May 1, 2025