తాజాగా ముంబైలో 2025 వేవ్స్ సమ్మిట్ గ్రాండ్ లెవెల్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకల్లో ప్రధాని మోడీ సందడి చేశాడు. ఆయనతోపాటు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రజనీకాంత్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి ఎంతోమంది దిగ్గజనుటలు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకల్లోనే అక్కినేని నాగార్జున సైతం పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్ని తన చేతులపై ప్రారంభించిన ఆయన.. కార్తీక్, ఖుష్బూ, అనుపమ్ కేర్తో కలిసి ఇండియన్ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ చర్చల్లో పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా.. నాగార్జున మాట్లాడుతూ బాహుబలి, పుష్ప, కేజిఎఫ్ సినిమాల బ్లాక్ బస్టర్ రిజల్ట్ పై క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా ఈ సినిమాలను ప్రస్తావిస్తూ 90 శాతం మంది ఆడియన్స్ తమ స్ట్రెస్వదిలించుకుని స్క్రీన్ పై జరిగే మ్యాజిక్ తో రిలీఫ్ అవ్వాలని సినిమాలకు వెళ్తారు. ఇక ఈ జనరేషన్ ఆడియన్స్ అయితే హీరోలను సూపర్ హీరోలుగా, లార్జర్ ధెన్ లైఫ్ పాత్రలో చూడాలని ఆరాటపడుతున్నారు. బాహుబలి, పుష్ప, కేజిఎఫ్ సినిమాలు బ్లాక్ బాస్టర్ అందుకోవడానికి కారణం కూడా అదే అంటూ వివరించాడు.
ఇక పుష్ప సినిమా అయితే తెలుగులో కంటే నార్త్ లో ఎక్కువగా కలెక్షన్లు కొల్లగొట్టింది. నాకు పుష్ప, బాహుబలి సినిమాలంటే చాలా ఇష్టం అంటూ నాగార్జున వివరించాడు. బాహుబలికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందంటూ ప్రశంసించాడు. ఇక ప్రస్తుతం నాగ్.. రజనీకాంత్తో కలిసి కూలి, శేఖర్ కమ్ముల.. కుబేర సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా టాలీవుడ్లో నా సామి రంగ సినిమా తర్వాత.. నాగార్జున ఒక సోలో సినిమాలో కూడా నటించలేదు.