ఇక భారత్ – పాక్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సెన్సేషనల్ ట్విట్..!

భారత్‌, పాకిస్తాన్ల మధ్య వార్ ధీటుగా కొన‌సాగుతున్న నేప‌ద్యంలో.. ఇరు దేశాల బోర్డ‌ర్‌ల‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్విట్ నెటింట సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించుకుంటున్నాయి అంటూ తన అధికారా అకౌంట్ ద్వారా ప్రకటించాడు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలు వార్ ఆగిపోవాలని ప్రారంభంలోనే కోరుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రెండు దేశాలు సమ‌య‌మనం పాటించాలి అంటూ కోరిన ట్రంప్.. ఇప్పటిదాకా జరిగిన కల్లోలం చాలు.. ఇకనైనా ఘర్షణలకు తెర‌దించాలని భారత్ పాక్‌లకు విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంలో తమ‌ వంతు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నాడు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినంత చేస్తానని వివరించాడు. ఈ నేపథ్యంలోనే ఈ మేరకు ఆయన ట్విట్ చేస్తూ భారత్ పాకులతో రాత్రంతా చర్చలు జరిపినట్లు పేర్కొన్నాడు. ఇరదేశాలు నాకు బాగా తెలిసిని.. ఈ క్ర‌మంలోనే.. రెండు దేశాల మధ్యవర్తిత్వాన్ని వహించాను.. ఈ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి అంటూ పేర్కొన్నాడు.

రెండు దేశాలకు నా అభినందనలు అంటూ ట్విట్‌లో వివరించాడు. ఇక ఈ విషయాన్ని భారత్ సైన్యం ధ్రువీకరించాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఘర్షణను పీక్స్ లెవెల్లో ఉన్న నేప‌ద్యంలో.. ఇప్ప‌టికి రెండు దేశాల‌మ‌ధ్య వార్ కొన‌సాగుతూనే ఉంది. ఈ ఇరు దేశాలు ఇప్ప‌టివ‌ర‌కు వార్ ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిందే లేదు. ఇలాంటి క్ర‌మంలో భారత్, పాక్‌ మధ్య వార్‌ ఇక ముగిసినట్లే అంటూ.. ట్రంప్ పేర్కొనడంతో ప్రస్తుతం ఈ ట్విట్‌ నెట్టింట సంచలనంగా మారింది.