భరత్ పై మేమే గెలిచాం.. పాకిస్తాన్ ప్రధాని

గత మూడు రోజులుగా పాక్, భారత్ మధ్య యుద్ధ‌ వాతావరణంతో ఉద్రిక్తత చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి శనివారం సాయంత్రం విరమణ ఒప్పందంతో ఫుల్ స్టాప్ పడింది. కాగా ఈ కాల్పుల విరమణ పై పాకిస్తాన్ ప్రధాని షాబాద్ షరీఫ్ రియాక్ట్ అయ్యాడు. శనివారం రాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో షరీఫ్ మాట్లాడుతూ.. భారత్‌పై యుద్ధంలో మేము విజయం సాధించాం అంటూ కామెంట్లు చేశాడు. మా దేశాన్ని మా పౌరులను రక్షించుకోవడానికి మేము ఎక్కడికైనా వెళ్తామని.. ఏదైనా చేస్తామని.. వెనుతిరిగేదే లేదంటూ వెల్లడించాడు. పాక్‌ను ఎవరు సవాలు చేసినా.. వారిని విడిచి పెట్టే ప్రసక్తే ఉండదంటూ చెప్పుకొచ్చాడు.

భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్లు, మిస్సైళ‌తో దాడి చేసిందని.. ఎంతోమంది సాధారణమైన పౌరుల చావుకు భారత్ కారణమైందంటూ మండిపడ్డాడు. తమ దేశంపై భారత్ ఆధారాలు లేకుండా ఆరోపణలు కూడా చేస్తుందని భారత్‌కు తగిన బుద్ధి చెప్పామంటూ వివరించాడు. తమ జోలికి వస్తే తాము ఏం చేయగలమో చూపించామని.. భారత్‌పై యుద్ధంలో పాక్ సక్సెస్ సాధించిందంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇరుదేశాలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని మూడు గంటలైనా కాకముందే మరోసారి పాకిస్తాన్ తమ వక్రబుద్ధి చూపించింది.

Pakistan PM Shehbaz Sharif claims 'victory' after ceasefire with India- The  Week

డ్రోన్‌ కాల్పులతో విరుచుకుపడి.. జమ్మూ, కాశ్మీర్‌లో అనేక ప్రాంతాల్లో దాడులకు దిగింది. సరిహద్దు రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్న క్రమంలో బ్లాక్ అవుట్ విధించారు. కాగా.. ప్రస్తుతం పాక్‌ ప్రధాని చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారడంతో భారతీయ పౌరులు.. అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. చేసే చెత్త పనులను వెనకేసుకుని రావడమే కాకుండా.. భారత్ పై నిందలు మీరు వేస్తున్నారంటూ.. ఒప్పందంపై నిలబడడం చేతకాన్ని వెన్నుపోటు పొడిచే మోసగాళ్లు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.